తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల కార్యక్రమంలో దేశ ముఖ్య నేతలు పాల్గోని అమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు. అదే కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అసంధర్బంగా చేసిన ఒక పని ఇప్పుడు వివాదంగా మారింది. జయలలిత చనిపోయిన బాధలో అందరూ ఉంటే రాహుల్ గాంధి మరియు ఆయన పక్కనున్న గులాం నబీ ఆజాద్ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫోటోలు వైరల్గా మారాయి.
తమిళులు ‘అమ్మ’గా కొలిచే జయలలిత చనిపోయి రాష్ట్రమంతా శోకసంద్రంలో మునిగిపోతే… తాము ఎందుకు వచ్చామో అన్న విషయం మరచిపోయి నవ్వుకోవడం సిగ్గుచేటని నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం పై సోషల్ మీడీయాలో పోస్టులు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. రాహుల్ గాంధి కి వయసు పెరుగుతున్న ఇంకా బుద్ది పెరగటం లేదని చాల మంది కామేంట్ చేసారు.