2016 రిపబ్లిక్ డే సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డుల జాబితాను విడుదల చేసింది. వివిద రంగాలలో చేసిన కృషికి గాను పలువురు తెలుగు వారు కూడా ఈ సారి జాబితాలో పేరు సంపాదించుకున్నారు. సూపర్ స్టార్ రజినికాంత్, రామోజీ రావు, శ్రీ శ్రీ రవి శంకర్, రిలయన్స్ సంస్థల ఫౌండర్ ధీరుభాయి అంబానీ, తదితరులు పద్మ విభూషణ్ జాబితాలో ఉన్నారు.
బాలివుడ్ నటుడు అనుపమ్ ఖేర్, ప్రముఖ క్రీడాకారీణులు సైనా నెహ్వాల్, సానియా మీర్జా, ఉదిత్ నారాయణ్ మరియు ఇతరులు పద్మభూషణ్ అవార్డ్ లు దక్కించుకున్నారు. ఇతర నటులు అజయ్ దేవ్గన్, ప్రియాంక చోప్రా, న్యాయవాది ఉజ్జ్వల్ నికాం మరియు దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి లు పద్మశ్రీ అవార్డ్ లు సొంతం చేసుకున్నారు.