Home / Entertainment / వాచ్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్న రాజమౌళి..!

వాచ్ కోసం కోట్లు ఖర్చు పెడుతున్న రాజమౌళి..!

Author:

కొన్ని సంవత్సరాల క్రితం వరకు వాచ్ ఆటే కేవలం టైమ్ చూసుకోవడానికి మాత్రమే వాడేవాళ్ళం.. కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ కూడా మారుతూ వస్తుంది, వాచ్ లలో కూడా అనలాగ్ , డిజిటల్ వాచ్ లు అంటూ చాలా రకాల వాచ్ లు వచ్చాయి..వాటి తర్వాత సరికొత్త ఫీచర్ లతో అంటే మెయిల్స్ చెక్ చేసుకోవడం, ఫోన్ మాట్లాడటం, నోట్స్ రాసుకోవడం, మనం నడుస్తుంటే ఎన్ని కాలరీలు ఖర్చు అయ్యాయో చెప్పడం…లాంటి ఫీచర్ లతో స్మార్ట్ వాచ్ లు మార్కెట్ లోకి ప్రవేశించాయి, ఇప్పుడు ఈ విషయమంతా ఎందుకంటే మన రాజమౌళి అలాంటి స్మార్ట్ వాచ్ కోసం కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు, కాకపోతే డబ్బులు పెట్టేది వాచ్ కొనడానికి కాదు..అమ్మడానికి…!

Rajamouli-Smart-Watch

ఐఐటీ మద్రాస్ కి చెందిన విద్యార్థులు కంజ్యూమెక్స్ అనే స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టి ‘ఇంటర్నెట్ ఆఫ్ యు’ అనే బ్రాండు పేరుతో సరికొత్త టెక్నాలజీతో కొన్ని పరికరాలు తయారుచేసి అమ్ముతున్నారు, వాటిలో ఒక హైబ్రిడ్ స్మార్ట్ వాచ్.. కొన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలు.. అలాగే గేమింగ్ కు సంబంధించిన వర్చువల్ రియాల్టి పరికరాలు కూడా ఉన్నాయట. ముఖ్యంగా స్మార్ట్ వాచ్ అయితే.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే సంవత్సరం వరకు తిరిగి చార్జ్ చేయాల్సిన అవసరం ఉండదట. ఈ స్మార్ట్ వాచ్ ఐడియాకి ఫిదా అయిన రాజమౌళి..బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డతో కలిసి ఆ కంపెనీలో కొన్ని కోట్లు డబ్బులు ఇన్వెస్ట్ చేయబోతున్నాడు, వచ్చే ఫిబ్రవరికి.. 100 డాలర్లు (6600 రూపాయలు) ఖరీదు చేసే ఈ స్మార్ట్ వాచ్ ను మార్కెట్ లోకి తీసుకొస్తారట. దానిని స్వయంగా రాజమౌళి లాంచ్ చేస్తాడని.. తెలుస్తోంది. అది సంగతి.

(Visited 374 times, 1 visits today)