Home / Inspiring Stories / సింధు ఒలింపిక్స్‌ ఫైనల్‌ను ఎన్ని కోట్ల మంది చూసారో తెలుసా?

సింధు ఒలింపిక్స్‌ ఫైనల్‌ను ఎన్ని కోట్ల మంది చూసారో తెలుసా?

Author:

రియో ఒలింపిక్స్‌ లో పతకాల కోసం యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న సమయంలో, బ్యాడ్మింటన్‌లో ఫైనల్ కి చేరి పతకం ఖాయం చేసిన సింధు మొత్తం భారాతవనిని ఆనందంలోకి నెట్టింది. ఫైనల్లో రజతంతో పాటు ఇప్పుడు మరో కొత్తరికార్డును సింధు నమోదు చెసింది. జపర్ అనే మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సారి మొత్తం ఒలింపిక్స్‌ లోనే ఎక్కువ మంది వీక్షించిన మ్యాచు మన సింధు, స్పెయిన్ కి చెందిన మారిన్ ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచేనట. ఈ మ్యాచ్‌ను టీవీల్లో మొత్తం దేశ వ్యాప్తంగా 6.6 కోట్ల మంది వీక్షించారు. మ్యాచు ప్రారంభంలో ఉన్న వీక్షకుల సంఖ్య మొదటి 15 నిముషాలలోనే 1.6 కోట్ల నుండి 3.8 కోట్లకు చేరి మ్యాచు ముగిసే సమయానికి మొత్తం 6.6 కోట్లకు చేరి ఈ ఒలింపిక్స్‌లోనే అత్యదిక మంది వీక్షించిన మ్యాచుగా రికార్దులలోకి ఎక్కింది.

record breaking views for sindhu final match

ఇక నగరాల విషాయానికొస్తే సింధు మ్యాచుని చూసిన వారిలో ముంబాయి వాసులు ఎక్కువగా ఉన్నరు. ముంబాయి నగరంలో సింధు ఫైనల్ ను 35 లక్షల మంది వీక్షించగా, 31 లక్షలతో హైదరాబాద్ రెండవ స్థానంలో నిలిచింది. బెంగళూరు 29 లక్షలు, దిల్లీ 24 లక్షలు, చెన్నైలో 23 లక్షలతో మిగతా స్థానాల్లో నిలిచాయి. ఏదీ ఏమైనా ఒక మ్యాచుతో దేశం మొత్తాన్ని ఎకతాటిపైకి తెచ్చి ఈ రికార్డు సాదీంచిన సిందు ను మరొక సారి అబినంధించాల్సిందే.

Must Read: రిలయన్స్‌ దెబ్బకి రూ.51 కే 1జీబీ 4జీ డేటా ఇస్తానంటున్న ఎయిర్‌టెల్‌.

(Visited 104 times, 1 visits today)