మన దేశంలో వరుసగా వివిధ బ్యాంకులలో జరుగుతున్న కుంభకోణాలు ఒక్కోటిగా బయటపడుతున్నాయి. మొన్నటి విజయ్ మాల్య నుండి నిన్నటి నీరవ్ మోడీ వరకు పెద్ద పెద్ద తిమింగళాలు బ్యాంకులలో కొందరి అధికారులను మభ్యపెట్టి, మాయచేసి ఏదో ఒక విధంగా పెద్దమొత్తం లో కొన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని స్వాహ చేసి విదేశాలకి పారిపోయారు. ఇలాంటి సంఘటనలు ప్రజలకు బ్యాంకుల మీద నమ్మకాన్ని పోగొడుతున్నాయి. ఇలాంటి సంఘటనే SBI వేలచెరి, తమిళనాడు బ్రాంచ్ లో జరిగింది.
కొందరు యువకులు కారు కొనేందుకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో సుమారుగా రూ. ౩.౩౦ కోట్లు రుణం గా తీసుకున్నారు. కానీ వారు ఆ సొమ్ము తో ప్రముఖ కబడ్డీ ఆటగాడు రాజా ను హీరో గా, మాళవిక మీనన్ ను హీరోయిన్గా పెట్టి “అరవ సంద ” అనే సినిమా తీసి విడుదల కోసం సిద్దమయ్యారు. బ్యాంకుకు కట్టాల్సిన లోన్ సరిగా కట్టడంలేదని గుర్తించిన అధికారులకు నమ్మసఖ్యం కాని విషయాలు తెలిసాయి. మొదట ఇది లోన్ తీసుకున్నవారు చేసిన మోసంగా భావించిన వారికి ఇది ఇంటిదొంగల హస్తమున్నట్లుగా పసిగట్టారు. కాగా, వారికి గత సంవత్సరం అక్టోబర్ లో డి.చిత్ర అనే ఆటో లోన్ మేనేజర్ ద్వారా ఆ సొమ్ము మంజూరు అయినట్టు అధికారులకు దర్యాప్తులో తెలిసింది.
చిత్ర అధికార దుర్వినియగానికి పాల్పడినట్లు, బ్యాంకు లోన్ తీర్చే సాఫ్ట్ వేర్ ని కూడా హాక్ చేసినట్టు తేలడంతో బ్యాంకు అధికారులు ఆమెపై తదుపరి చర్యలకు సన్నద్దమయ్యారు. బ్యాంకుని మోసం చేయడమే కాకుండా, లోన్ సొమ్ముని దుర్వినియోగ పరిచిన ఆ చిత్రబృందాన్ని అందులో నటించిన నటీనటులకి కోర్టు ద్వారా నోటీసులను అందచేసారు. లోన్ మనీ రికవరీ అయ్యేదాకా సినిమాని విడుదల చేయకూడదని, ఆడియో, వీడియో, శాటిలైట్ హక్కులను తమకే అప్పగించాలని బ్యాంకు కోర్టుని ఆశ్రయించింది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో..