దేశ టెలికాం మార్కెట్లో మరో అతి పెద్ద సంచలనానికి తెర తీసింది రిలయన్స్. జియో 4G స్మార్ట్ ఫోన్ లాంఛ్ చేసింది. మేడిన్ ఇండియా నినాదంతో ముఖేష్ అంబానీ ఈరోజు జరిగిన రిలయన్స్ వార్షిక సమావేశంలో ప్రకటించారు. ఇండియా కా స్మార్ట్ ఫోన్.. జియోఫోన్ గా అభివర్ణించారు. దేశంలోని 70కోట్ల మొబైల్ వినియోగదారుల్లో ఇప్పటికీ 50 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉన్నారన్నారు. వీళ్లందరికీ చేరువ కావాలనే ఉద్దేశ్యంతో అత్యంత చౌక ధరలో జియో స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చినట్లు ప్రకటించారు.
జియో స్మార్ట్ ఫోన్ ఉచితంగానే ఇస్తున్న, మూడేళ్ళ కాలానికి డిపాజిట్ గా రూ.1500 చెల్లించాలి, మూడేళ్ల తర్వాత ఈ రూ.1500 తిరిగి ఇస్తారు. భారతీయులకు మాత్రమే ఇది ప్రత్యేకంగా అభివర్ణించారు అంబానీ. ప్రస్తుతం జియో కస్టమర్లుగా ఉన్న వాళ్లందరికీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆగస్ట్ 15వ తేదీన ఫోన్ విడుదల అవుతుంది. ఆగస్ట్ 24వ తేదీ నుంచి బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఓపెన్ మార్కెట్ లోకి వస్తాయి. ప్రతి వారం 50లక్షల ఫోన్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
జియో స్మార్ట్ ఫోన్ ఫోన్ ఫీచర్స్ ఇవే :