Home / Latest Alajadi / ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ హోటల్ లో ఎలాంటి ఆఫర్ పెట్టారో చూస్తే షాక్ అవుతారు.!

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ హోటల్ లో ఎలాంటి ఆఫర్ పెట్టారో చూస్తే షాక్ అవుతారు.!

Author:

డిస్కౌంట్ అంటే మనకి గుర్తొచ్చేది బట్టల షాపులు లేకుంటే ఎలక్ట్రానిక్స్ షాపులు. కానీ హోటల్స్ లో డిస్కౌంట్ అనేది ఎప్పుడు విని ఉందాము. ఏదో ఒకోసారి తక్కువ ధరకే బఫెట్ పెడుతుంటారు కానీ పది శాతం తగ్గింపు అని అయితే ఎప్పుడు పెట్టారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఎన్నికల ఫీవర్ ఓ హోటల్ కి కూడా ఎక్కింది. ‘ మీ ఓటుకు లెక్క ఉంది. మీ ఓటు మార్కు చూపించి, మా వద్ద రెండు రోజుల పాటు 10 శాతం డిస్కౌంట్ పొందండి..’’ అంటూ రెస్టారెంటు ముందు బోర్డు పెట్టారు.

మధ్య ప్రదేశ్ లోని ఓ రెస్టారెంట్లు తమదైన శైలిలో ఈ విధంగా ప్రచారం చేస్తున్నాయి.
అదే విధంగా బార్బర్ షాపు నడుపుతున్న సతీశ్ చౌహాన్ అనే వ్యక్తి కూడా వినూత్న రీతిలో ఓటర్లను ప్రోత్సహిస్తున్నాడు. మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఓటు వేసిన వారికి తన షాపులో ఉచిత సేవలు అందిస్తున్నాడు. ఓటర్లు తమ చేతివేలుపై ఇంక్ మార్కు చూపిస్తే చాలు.. ఉచితంగా షేవింగ్ చేస్తున్నాడు.

ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకుంటావని అడిగితే… ‘‘దేశ ప్రగతి మార్గంలో పయనించడమే నా అసలు లక్ష్యం..’’ అని తన దేశభక్తిని చాటుకున్నాడు. కొంతమందికి ఇది అర్ధమయినా అతని లక్ష్యం నెరవేరినట్టే.

(Visited 1 times, 1 visits today)