టీమిండియా ఎక్కడ క్రికెట్ ఆడినా అక్కడికెళ్ళి మరీ మన ఆటగాల్లనీ ఉత్సాహపరిచే ఒక క్రికెట్ వీరాభిమానిని మీరంతా ప్రతి మ్యాచ్ లోనూ చూసే ఉంటారు. టీవీ వ్యాఖ్యాతలు కూడా అతడు టీవీలో కనబడగానే అతడి గురించి, అతడి క్రికెట్ పిచ్చి గురించి చెబుతూనే ఉంటారు. అతడే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్. ఇప్పుడు సచిన్ క్రికెట్ ఆడకపోయిన తన శరీరం మీదా సచిన్ పేరు రాసుకుని ప్రతి మ్యాచులో భారత జట్టును ఉత్సాహపరుస్తుంటాడు సుధీర్. త్వరలో ఇంగ్లాండ్ లో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుని ఉత్సాహపరిచేందుకు ఇంగ్లాండ్ వెళ్ళెందుకు వీసా దరఖాస్తు చేసుకున్నాదు సుధీర్ కాని అతని వీసాను రిజెక్ట్ చేసారు అక్కడి అధికారులు.ఎ ఎ విషయం తెలుసుకున్న టెండూల్కర్ స్వయంగా, అతనికి వీసా జారీ చేయాలని కోరుతూ వీసా అధికారులకు లేఖ రాసాడు.
టెండూల్కర్ రాసిన లేఖ, టెండూల్కర్ మాటల్లోనే….. “అతడు భారత్ జట్టుకి వీరాభిమాని. ఒకరకంగా సుధీర్ టీమిండియాకి అనధికార ప్రచారకర్త. టీమిండియా ఎక్కడ మ్యాచులు ఆడినా తన సొంత ఖర్చుల మీద వెళ్లి మరీ ఆటగాళ్లను ఎంకరేజ్ చేసే సుదీర్ గురించి మన ఆటగాల్లందరికీ తెలుసు. పేదరికం నుంచి వచ్చినా కూడా క్రికెట్పై ఉన్న పిచ్చితో సొంత ఖర్చులపై స్టేడియానికి వచ్చి ఆటగాళ్ళలో ఉత్సాహం నింపుతున్నాడు. అతని అభిమానానికి అడ్డు చెప్పకండి. అతని వీసా సమస్యని తీర్చే ప్రయత్నం చేయండి” అని సచిన్ లేఖ రాసాడు. ఈ లేఖతో ఫాస్ట్ ట్రాక్ వీసా కోసం సుధీర్ దరఖాస్తు చేసుకోగా అధికారులు అతనికి వీసా మంజూరు చేసారు. దీనికి సుధీర్ 26వేల రూపాయలు చెల్లించుకోవాల్సి వచ్చింది. మామూలుగా సాధారణ వీసాకి రూ.7,500 మాత్రమే ఖర్చవుతుంది. జూన్ 1 నుంచి మొదలవనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో, జూన్ 4న భారత్ , పాకిస్థాన్తో ఢీకొనబోతోంది. మొత్తానికి క్రికెట్ దేవుడు వీసా ఇవ్వమని అధికారులకు సూచించాడు.. వీర భక్తుడు సుధీర్ కి వీసా వచ్చేసింది.