ప్రేమమ్ సినిమాతో మలర్ గా ప్రేక్షకులపై ప్రత్యేకమైన ముద్ర వేసిన సాయి పల్లవి ” ఫిదా ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది,ఫిదా సినిమాలో భానుమతిగా సాయి పల్లవి చేసిన నటనకి ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు, ముఖ్యంగా సాయి పల్లవి మాట్లాడిన తెలంగాణ యాసకి, డాన్స్ లకి ప్రేక్షకులంతా ఫిదా అవుతున్నారు, అయితే సినిమాలకి రాకముందే సాయి పల్లవి ఈటీవీ లో వచ్చే ఢీ అనే డాన్స్ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయింది, ప్రేమమ్ సినిమా తరువాత ఓ మలయాళ రియాలిటీ షోకి హాజరైంది. అక్కడ బరసో రే అనే సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఆడియన్స్ తో పాటు జడ్జెస్ కూడా ఈ అమ్మడి పర్ ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు.
ఫిదా సినిమాతో మరోసారి సాయి పల్లవి పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవ్వడంతో అప్పటి వీడియో ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు, ఆ వీడియోపై మీరు కూడా లుక్కేయండి..!
నోట్ : వీడియోని 30 నిమిషాల తర్వాత ప్లే చేయండి.