భారత క్రికెట్తో పాటు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. టెస్ట్, వన్డేల్లో జట్టును నెంబర్వన్ ప్లేస్లో పెట్టిన ధీశాలి, ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్కప్, టీ20 వరల్డ్కప్లను అందుకున్న ఏకైక కెప్టెన్…ఎన్నో గెలిచిన కెప్టెన్…తాజాగా తన భార్య మనసును మరోసారి గెలిచాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షి ధోనీతో కలిసి షాపింగ్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో ఆయన తన భార్యకు చెప్పులు తొడుగుతూ కెమెరా కంటికి చిక్కాడు. అంతే.. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ ఆడుతుండటంతో.. విశ్రాంతిలో ఉన్న ధోని.. ఇటీవల తన భార్య సాక్షిసింగ్తో కలిసి షాపింగ్కు వెళ్లాడు.
ఈ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన సాక్షి… ‘బిల్లు నువ్వే కట్టావ్గా.. షూస్ కూడా నువ్వే వేయ్’ అని కామెంట్ చేసింది. టీమిండియా విజయవంతమైన కెప్టెన్గా పేరొందిన ధోనీ ఏమాత్రం అహం చూపకుండా.. షాప్లో అందరి ముందూ అలా సాక్షికి సాయం చేయడంపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
క్రికెట్ ఫీల్డ్లో ఎన్నో తిరుగులేని రికార్డులతో లెజెండ్గా గుర్తింపు పొందిన మాహీ… సాక్షికి చెప్పులు తొడుగుతున్న ఫోటోలు చూసి కొంతమంది “ఎంతటి మహేంద్రసింగ్ ధోనీ అయినా భార్య ముందు వంగాల్సిందే…’ అని కొందరు పాజిటివ్గా స్పందిస్తుంటే… మరికొందరు ‘మా హాహీతో ఇలా చెప్పులు తొడిగించుకుంటావా…’ అని నెగిటివ్గా కామెంట్లు పెడుతున్నారు. ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
చెప్పులు వేయించుకోవడం అనేది మీ వ్యక్తిగత విషయం. కాని అది పబ్లిక్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు అంటూ సాక్షికి సోషల్ మీడియా జనాలు తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. గతంలో కూడా ధోని భార్య అసభ్యకర కాస్ట్యూమ్స్ వేసుకోవడంతో పాటు, ఒక హీరోయిన్ స్థాయిలో ఫీల్ అవుతూ వచ్చింది. అప్పుడు కూడా మీరు ఒక గొప్ప క్రికెటర్ భార్య అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు.