Home / Inspiring Stories / ఒలింపిక్స్‌లో కాంస్యంతో బోణీ కొట్టిన సాక్షి మాలిక్‌.

ఒలింపిక్స్‌లో కాంస్యంతో బోణీ కొట్టిన సాక్షి మాలిక్‌.

Author:

రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం నిరీక్షిస్తున్న భారతీయుల కల నెరవేరింది. రియో ఒలింపిక్స్‌ మొదలైన 11 వ రోజు మన దేశానికి మొదటి పతకం లభించింది. మహిళల రెజ్లింగ్‌ 58 కిలోల విభాగంలో  సాక్షి మాలిక్‌ కాంస్యం సాధించి భారత్ కి మొదటి పతకం అందించింది. క్వార్టర్స్‌లో ఓడినా కూడ క్వార్టర్‌ఫైనల్‌ ప్రత్యర్థి ఫైనల్‌ చేరడంతో రెపిచేజ్‌కు అర్హత సాదించిన సాక్షి వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి కాంస్యం సాధించింది.

sakshi malik wins bronze in Olympics

2014 కామన్వెల్త్‌ క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి రజతం నెగ్గిన సాక్షి  58 కిలోల విభాగంలోనే పోటీపడుతున్న మరో స్టార్‌ రెజ్లర్‌ గీతతో పోటీగా ఒలింపిక్స్‌ అర్హత పోటీలకు వెళ్ళింది. గీత అర్హత పోటీలలో విఫలమవగా సాక్షి  అర్హత సాధించి ఇప్పుడు ఏకంగా పతకాన్నే గెలిచింది. మంచి దూకుడు ఆట తీరు కనబర్చిన సాక్షి ఒకే రోజు నాలుగు మ్యాచులు ఆడి కాంస్యం సొంతం చేసుకుంది. రియో ఒలింపిక్స్‌లో మన దేశానికి మొదటి పతకం అందించిన సాక్షి కి అలజడి తరపున శుభాకాంక్షలు.

(Visited 80 times, 1 visits today)