అందరూ ఊహించిందే నిజమైంది, తమిళనాడులో శశికళ కు ముఖ్యమంత్రి పట్టం కట్టబెట్టడానికి రంగం సిద్దం అయ్యింది. ఈరోజు చెన్నై లోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన సమవేశంలో పాల్గొన్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు శశికళను అన్నాడీఎంకే పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తదనాంతరం ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేశారు. ఇక తదుపరి ఈ నిర్ణయాన్ని గవర్నర్ కి తెలిపి గవర్నర్ అమోదం పొందితే ఇక తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ పట్టమెక్కనున్నారు.
జయలలిత మరణానంతరం పన్నీర్ సెల్వం మరోసారి తమిళనాడు అయ్యారు, కాని చాలామంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శశికళకు మొదటినుండి మద్దతిస్తూ వస్తున్నారు. మొదట శశికళను పార్టీ ప్రెసిడెంట్ గా చేసారు. కాని అనూహ్యంగా ఈ రోజు సమావేశమైన అన్నాడీఎంకే పార్టీ వర్గాలు ఎలాంటి పోటీ లేకుండా శశికళను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అసలు ఆమె పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించడం ఇంకో విశేషం. ఈ వివిరాలు తెలపడానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇక ఒక మంచి రోజు చూసుకొని చిన్నమ్మ ప్రమాణస్వీకారం చేయడమే తరువాయి.