Home / Latest Alajadi / కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్న కొత్తబంగారు లోకం హీరోయిన్.! ఎవరిని పెళ్లి చేసుకుంటుందంటే.?

కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్న కొత్తబంగారు లోకం హీరోయిన్.! ఎవరిని పెళ్లి చేసుకుంటుందంటే.?

Author:

శ్వేతా బసు ప్రసాద్..కొత్త బంగారులోకం సినిమాతో టాలివుడ్ ప్రేక్షకులకు పరిచయం అయింది..ఆ సినిమాలో నటనతో అందరిని ఆకట్టుకుంది..బాలనటిగా బాలివుడ్లో కెరీయర్ ప్రారంభించింది శ్వేత.కెరీర్ ప్రారంభంలోనే సినిమా హీరోయిన్లు పడే కష్టాలన్ని పడింది.అవకాశాలు లేక వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. అప్పుడప్పుడే కెరీర్లో ఎత్తుపల్లాలు చూసి ఒకేసారి గట్టి దెబ్బే తిన్నది ఈ సంఘటనతో శ్వేత…అప్పుడు మహిళాసంఘాలు అందరూ శ్వేతకే మద్దతు తెలిపాయి..ఆ సంఘటన తర్వాత ఒకసారిగా గోడకు కొట్టిన బంతిలా లేచింది శ్వేత చంద్రనందిని సీరియల్ తో..తన నటన ద్వారా మరొకసారి ప్రేక్షకుల మన్ననలు పొందింది.ఇప్పుడు శ్వేతా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వబోతున్నారు.

ఫిల్మ్‌మేకర్‌ రోహిత్‌ మిట్టల్‌ను శ్వేతా వివాహం చేసుకోబోతున్నారు. డిసెంబరు 13న పుణెలో వీరి పెళ్లి. తర్వాత ముంబైలో రిసెప్షన్ అంట. మార్వాడీ, బెంగాలీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్వేత తన కాబోయే భర్త, స్నేహితులతో కలిసి ఇండోనేషియా, బాలీలో బ్యాచిలర్‌ పార్టీని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.

ఇక వారి లవ్ స్టోరీ విషయానికి వస్తే..శ్వేతా, రోహిత్‌లు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్షణాల కోసం మేమంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. శ్వేతానే ముందుగా ప్రపోజ్‌ చేసింది. గోవా వెళ్లినప్పుడు శ్వేత, రోహిత్‌కు ప్రపోజ్‌ చేసింది. తర్వాత రోహిత్‌ పూణెలో ఎస్‌ చెప్పాడు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక అబ్బాయిలే ముందు ప్రపోజ్‌ చేయాలనేది పాత మాట. ఇద్దరి మధ్య ఒకే రకమైన భావాలు ఉన్నప్పుడు ఎవరు ముందు ప్రపోజ్‌ చేశారనేది ముఖ్యం కాదు.

(Visited 1 times, 1 visits today)