సమయం గడిచేకొద్దీ శ్రీదేవి మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఆమె భౌతికకాయం ఎప్పుడెప్పుడు భారత్ కి వస్తుందా అని ఎదురుచుస్తున్నవారికి అక్కడి అధికారుల వల్ల ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలా ఎదురుచుసేవారికి నిర్ఘాంతపోయే సమాచారం ఈరోజు సాయంత్రం విడుదలైన ఫోరెన్సిక్ మరియు పోస్ట్మార్టం నివేదిక వెలువడి అవి మరింత కలవరపెడుతున్నాయి.
ఇప్పటివరకు ఆమె మరణం సహజంగా కార్డియాక్ అరెస్ట్ వల్ల సంభవించినట్టుగా అందరూ భావించారు. కానీ పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఆమె బాత్ టబ్ లో పడి చనిపోయినట్టుగా నివేదిక ఇచ్చింది. ఇందులో ఏది నిజం ? మరికొందరు ఆమెకి త్రాగుడు అలవాటు ఉందని, ఆమె ఆ మైకంలోనే బాత్ టబ్ లో పడిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 20వ తారీఖున పెళ్లి వేడుకల్లో హుషారుగా పాల్గొన్నారు, ఆ తరవాత రెండురోజులు ఆమె హోటల్ రూమ్ నుండి బయటకు రాలేదని, అసలు ఆమె ఆ రెండురోజులు ఏమి చేశారన్నది పెద్ద మిస్టరీగా మారింది. 23 న జరిగిన పెళ్లి రిసెప్షన్లో చలాకీగా డాన్సు చేస్తూ వచ్చిన అతిథులను సరదాగా పలకరించారు. 24న మరణించారు.
ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆమె మరణం గురించి సరైన సమాచారం లేకపోవడం అది తప్పులతడకలా ఉందంటూ పోలీసులు కేసును దుబాయ్ లాయర్లకు అప్పగించింది. లాయర్లు ప్రాథమిక సమాచారాన్నిబట్టి హోటల్ సిబ్బందిని , బోనీకపూర్ ను నాలుగు గంటలనుండి విచారణ జరుపుతున్నారు. శ్రీదేవి మృతికేసు ఒక కొలిక్కి వచ్చేంతవరకు బోనీకపూర్ దేశం వదిలిపోకూడదని పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఇంకా శ్రీదేవి మృతి ఎన్ని మలుపులు తిరుగుతుందో ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.