కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న 8300 ఉద్యోగాలని భర్తీ చేయుటకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ జారీ చేసింది, అన్ని రాష్ట్రాలలో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్- టెక్నికల్) విభాగంలో భారీ ఎత్తున కొలువులని ప్రకటించింది, ఈ ఉద్యోగాలకి పదవ తరగతిని విద్యార్హతగా ప్రకటించారు, ఈ ఉద్యోగాలకి అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులు, Ex – Servicemen , మహిళ అభ్యర్థులకి దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు ఉంది, ఏప్రిల్, మే నెలలలో జరిగే రాత పరీక్ష ద్వారా ఉద్యోగులని ఎంపిక చేస్తారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో గ్రూప్- C కేటగిరీలో ఉండే ఈ ఉద్యోగులు మొదటి నెలలోనే దాదాపు 18 వేల రూపాయల జీతం అందుకునే ఆవకాశం ఉంది.
Note: మరిన్ని వివరాలకి SSC బోర్డు విడుదల చేసిన నోటిఫికేషన్ ని చూడండి.
కేవలం పదవ తరగతి విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంతో పాటు దాదాపు నెలకి Rs.18,000 జీతాన్ని సంపాదించే ఆవకాశం ఉంది, ఈ విషయాన్ని అందరికి చేరేలా షేర్ చేయండి.