Home / Latest Alajadi / స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.

స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.

Author:

ఈ సోషల్ మీడియా ప్రభావమో, సినిమాల ప్రభావమో కానీ ఈ మధ్య పిల్లలలో విపరీత పోకడలు పెరిగిపోతున్నాయి, చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోని జీవితాలను నాశనం చేసుకుంటున్నారు, ఇలాంటి సంఘటనే హర్యానా లో జరిగింది, హర్యానాలోని యమునానగర్ లో వివేకానంద స్కూల్ ఉంది. అందులో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి స్కూల్ కి రెగ్యూలర్ గా రాకపోవడం వల్ల హాజరు శాతం తక్కువగా ఉంది, ఈ విషయంపై క్లాస్ టీచర్ విషయాన్ని ప్రిన్సిపాల్ కు సమాచారం ఇచ్చింది. దీంతో ప్రిన్సిపాల్ రితూ చాబ్రా..సదరు స్టూడెంట్ ను పిలిచి స్కూల్ కి రెగ్యులర్ గా రావాలని, క్లాస్ లు సరిగా వినాలని మందలించింది, ఈ విషయంలో ప్రిన్సిపాల్ పై కోపం పెంచుకున్న స్టూడెంట్..మరుసటి రోజు ఉదయం (జనవరి 20) స్కూల్ కు తన తండ్రి దగ్గరున్న లైసెన్స్ తుపాకీ తీసుకువచ్చాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రిన్సిపాల్ గదికి వెళ్లి తను తెచ్చుకున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ప్రిన్సిపాల్ పైకి నాలుగు రౌండ్లు కాల్చాడు. రీతూ చాబ్రా శరీరంలోకి బుల్లెట్లు దూసుకువెళ్లాయి. కాల్పుల శబ్ధంతో స్కూల్ వణికిపోయింది. వెంటనే అలర్ట్ అయ్యి.. పారిపోతున్న స్టూడెంట్ ను పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు రీతూ చాబ్రా చనిపోయింది.

హర్యానా

స్కూల్. కాలేజీలలో టీచర్లు అయిన, ప్రొఫెసర్లు అయిన విద్యార్థులు క్రమశిక్షణ తప్పితేనే విద్యార్ధి భవిష్యత్ బాగుండాలనే ఉద్దేశ్యంతో మందలించడమో, దండించడమో, కోప్పడడం చేస్తారు.. దానికే చదువు నేర్పించే వాళ్లపై పాగా పెంచుకొని కొట్టడం, చంపడం లాంటివి చేయడం వల్ల వారి భవిష్యత్ యే నాశనం అవుతుంది, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్, సినిమాల వల్ల స్కూల్ పిల్లలలో ఇలాంటి విపరీత పోకడలు పెరిగిపోతున్నాయి, తల్లితండ్రులే పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచడం చాలా మంచిది.

(Visited 386 times, 1 visits today)