తెలంగాణ ఎన్నికలు ముగిసాయి. రేపు ఫలితాలు రానున్నాయి. తెరాస కి మహాకూటమి కి మధ్య మంచి పోటీనే ఉంటుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే వెల్లడైంది. ఎలక్షన్స్ కి ముందు ఎవరి స్టైల్ లో వారు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో టీడీపీ అభ్యర్థిగా ఎన్టీఆర్ సోదరి సుహాసిని పోటీ చేస్తుంది అని వెల్లడించడంతో ఆమె గురించి చాలా మంది నెట్ లో సెర్చ్ చేసారు.
సుహాసిని పోటీ చేస్తుండడంతో ఆమె సోదరుడు, స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, తారక్ ప్రచారానికి రాలేదు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా సోషల్మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో మరో ఆసక్తికర వార్త నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది.
దర్శకధీరుడు రాజమౌళితో చేస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా కోసం ఎన్టీఆర్ బరువు పెరుగుతున్నారట.తాజగా ఓ స్టిల్ కూడా వైరల్ అయ్యింది. న లుక్ రివీల్ కాకూడదన్న జక్కన్న సూచనతోనే బయటకు రావడం లేదని అంటున్నారు. తమ సోదరికి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా నందమూరి బ్రదర్ కల్యాణ్రామ్, తారక్ ఇద్దరూ ప్రెస్నోట్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి ఓటు వేయడానికి వచ్చారు కదా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ అసలు కారణం ఏంటో మరి.?
ఇది ఇలా ఉండగా..సోషల్మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో ఇప్పటిది కాదంటూ తారక్ పర్సనల్ ట్రైనర్ స్టీవెన్స్ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చారు.ఏడాది క్రితం లుక్ అని చెబితే ఎలా నమ్మాలంటూ సోషల్మీడియాలో నిలదీస్తున్నారు. ఇది ఆర్ఆర్ఆర్కు సంబంధించిన లుక్కేనని, దాన్ని రివీల్ చేయకుండా ఉండేదుకే ఇలా కవర్ చేస్తున్నారని తారక్ పర్సనల్ ట్రైనర్ ట్వీట్కు రిప్లయ్ ఇస్తున్నారు.