ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సినిమా రంగానికి సంబందించి నంది పురస్కారాలు అందించేవారు. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నంది పురస్కారాల స్థానంలో కొత్త అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. అవార్డు పేరు మరియు రూపకల్పన కోసం ఒక కమిటీని ఎర్పాటు చేసింది. ఆ కమిటీ పురస్కారానికి లయన్( సింహం) పేరును ఖరారు చేసింది మరియు పురస్కారాన్ని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి రూపంలో ఉండే విధంగా రూపొందించాలని నిర్ణయించారు.
ఈ కమిటీ కి చైర్మన్ గా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రమణాచారి వ్యవహరిస్తున్నారు. కమిటీ నివేదికను సీఎంకు త్వరలో అందించనున్నారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా సీఎం కేసీఆర్ పేరును ఫైనల్ చేసి అవార్డుల పేరును జనవరి 1, 2017న అధికారికంగా ప్రకటించనున్నారు.