నయీమ్ ని పెంచి పోషించింది అప్పటి పాలకులే అని నయీమ్ తో సంబంధం పెట్టుకున్న రాజకీయ నాయకులని, పోలీస్ అధికారులని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా బద్దలు కొట్టినట్లు స్వయంగా సీఎం కెసిఆర్ యే ప్రకటించారు, నయీమ్ కొన్ని వేల ఎకరాల భూమిని కబ్జా చేసి రాజకీయా నాయకులకి, పోలీసులకి బహుమతిగా ఇచ్చేసాడు, నయీమ్ ప్రతి రాజకీయ నాయకుడితో, పోలీస్ అధికారితో జరిపిన లావాదేవిలని తన డైరీలో రాసుకున్నాడు అని పోలీసులే తెలిపారు, ఇప్పుడు మాత్రం గ్యాంగ్ స్టర్ నయీమ్ తో రాజకీయ నాయకులకి, పోలీసులకి ఎటువంటి సంబంధాలు లేవని తేల్చేసారు.
నయీమ్ కేసుని సిబిఐతో విచారించాలని హై కోర్ట్ లో వేసిన పిటిషన్ కి కౌంటర్ గా తెలంగాణ ప్రభుత్వం చెప్పిన సమాధానం ఇది. నయీమ్ కి రాజకీయా నాయకులతో, పోలీస్ అధికారులతో సంబంధాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని, నయీమ్ రాజకీయా నాయకులకి, పోలీసులకి ఎటువంటి లబ్ది చేకూరించలేదని తెలంగాణ ప్రభుత్వం హై కోర్ట్ తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం హై కోర్ట్ కి తెలిపిన వాటిలో ముఖ్యాంశాలు:
ఇది నయీమ్ కేసులో విచారణ సరిగ్గా జరగట్లేదని, ప్రధాన నిందితులు అయిన రాజకీయా నాయకులని, పోలీస్ అధికారులని ఈ కేసు నుండి తప్పించే విధంగా ప్రయత్నిస్తున్నారని, నయీమ్ కేసుని సిబిఐ చేత విచారణ చేసే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హై కోర్ట్ లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది.
నయీమ్ చేసిన దురాగతాల గురుంచి ప్రతి ఒక్కరికి తెలుసు, నయీమ్ అనే గ్యాంగ్ స్టర్ ని పెంచి పోషించింది రాజకీయా నాయకులూ, పోలీసులే అని జగమెరిగిన సత్యం, కానీ ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం నివేదిక ఇవ్వడంతో తెలంగాణ ప్రజలు ఆశ్ఛర్యపోతున్నారు, నయీమ్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం అని పదే పదే సీఎం కెసిఆర్ యే చెప్పడంతో న్యాయం జరుగుతుంది అని భావించిన నయీమ్ భాదితులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే నిందితులని కాపాడే ప్రయత్నం చేస్తుండటంతో ఏం చేయాలో దిక్కు తోచక బాధపడుతున్నారు.