Home / Political / అమెరికాలో తోటి తెలుగు వాడినే పొడిచి చంపాడు.

అమెరికాలో తోటి తెలుగు వాడినే పొడిచి చంపాడు.

Author:

మనదేశంలో ఒక ప్రాంతం వాళ్ళు కలిసిమెలిసి ఉండకపోయినా వేరే దేశంకి వెళ్ళినప్పుడు మాత్రం మన వాడు అనే ఫీలింగ్ అందరిలో ఉంటుంది. అలా అమెరికాలో మన తెలుగు వాడే అని నమ్మి రూమ్ లో ఉంచుకున్నందుకు ఇప్పుడు ఆ తెలుగు వాడి చేతిలోనే హత్య చేయబడ్డాడు హైదరాబాద్ కి చెందిన సంకీర్త్. ఇలాంటి సంఘటనలు చదివినప్పుడు ఎదుటి వారికి సాయం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతుంది.  కేవలం 15 రోజుల వారిద్దరి స్నేహం ఎందుకు ఒకరి హత్య కి దారితీసిందో ఇంకా ఎవరికి తెలియదు.

Telugu guy murdered another in USA

రెండున్నర సంవత్సరాల క్రిందట సంకీర్త్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చదువులు ముగిసిన తర్వాత ఆస్టిన్ నగరంలో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఈ మధ్య కాలంలోనే సాయి సందీప్ అనే తెలుగు విద్యార్ధి పరిచయం అయ్యాడు. సందీప్ కి ఉండేందుకు ఇల్లు లేకపోవడంతో తన రూమ్ లోనే ఉండటానికి సంకీర్త్ ఒప్పుకున్నాడు. తర్వాత ఏమైందో కానీ  ఈ సోమవారం ప్రోద్డున ఉదయం 3 గంటలకు ఎవరో ఇద్దరు ఒక శవాన్ని కారులో ఎక్కిస్తున్నట్లు పోలీసులకు ఫోన్ వచ్చింది. వారు వచ్చి చనిపోయింది సంకీర్త్ అని , కత్తి పొట్ల వల్ల అతను చనిపోయాడు అని నిర్దారించారు. ప్రాధమిక సమాచారం ప్రకారం సందీప్ ని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. కానీ అసలు ఈ గొడవకు కారణం ఏంటి అనేది సందీప్ నోరు విప్పెదాక తెలియదు. మంచి చదువులు చదివి అమెరికా లో ఉద్యోగాలు చేస్తూ ఇలాంటి సంఘటనలో తమ కొడుకు ప్రాణాలు విడుస్తాడనీ అనుకోలేదని సంకీర్త్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుల విలపిస్తున్నారు.

(Visited 2,542 times, 1 visits today)