Home / Devotional / తెలుగు వివాహంలో ముఖ్యమైన సంప్రదాయములు

తెలుగు వివాహంలో ముఖ్యమైన సంప్రదాయములు

Author:

ఇప్పుడు ఎక్కడ చూసిన మనకు వినిపించే సౌండ్ పెళ్ళి బాజా బజంత్రీలు ఎందుకంటే ఇప్పుడు అన్ని మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలోనే ఎక్కువగా పెళ్ళిలు జరుగుతాయి. పెళ్ళిలకు మనం కచ్చితంగా వెళ్ళ వలసి వస్తుంది కద! కాని పెళ్ళిలో జరిగి కొన్ని ముఖ్యమైన అంశాలు మనకు ఎంతవరకు తెలుసు ఇంతకు పెళ్ళిలో ఎన్ని ముఖ్యమైన గట్టాలు ఉంటాయి!?…

అజందులో కొన్ని మనం తెలుసుకుందాం …

తెలుగు వివాహం లోని ముఖ్యమైన అంశాలు :-1) పెళ్ళి చూపులు 2) నిశ్చయ తాంబూలాలు 3) స్నాతకం 4) కాశి యాత్ర 5) వర పూజ-ఎదుర్కోల్లు 6) గౌరీ పూజ 7) మంగళ స్నానాలు 8) కన్యా వర్ణం 9) మధుపర్కాలు 10) యజ్నోపావితాధారణ 11). మహసంకల్పం 12). కాళ్ళు కడగటం 13). జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టటం 14). కాళ్ళు తొక్కించడం 15). కన్యాదానం 16). స్వర్ణజలాభి మాత్రాణం 17). యోక్త్ర బంధనం 18). మంగళ సూత్రధారణ 19). తలంబ్రాలు 20). బ్రహ్మ ముడి 21). ఉంగరాలు తీయడం 22). సప్తపది-ఫాణీగ్రహణం 23). ప్రధాన హోమం 24). సన్నికల్లు తొక్కడం 25). లాజా హోమం 26). స్థాలిపాకం 27). నాగవళ్లి 28). సదస్యాం 29). నల్లపూసలు కట్టడం 30). అరుందతి దర్శనం 31). ఉయ్యాల-బొమ్మని అప్పచెప్పటం 32). అంపకాలు 33). గృహప్రవేశం.

Telugu people marriage traditions with science

పైన ఉన్న వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందం.

పెళ్ళి చూపులు:

పెళ్ళికి మొట్ట మొదటి అడుగే ఈ పెళ్ళి చూపులు. ఈ పెళ్ళి చూపులు హిందు మత సాంప్రదాయం ప్రకారం చూపులు అమ్మాయి వాళ్ళ ఇంటి వద్ద జరుగుతాయి. పెళ్ళి కొడుకు తరుపువారు 3 లేదా 5 మందితొ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు. అమ్మాయి ని తయారు చేసి అబ్బాయి తరుపున వారిక్కి చూపిస్తారు. తరువాత ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి నచ్చితే పెద్దవారు కట్న, కానుకలు మాట్లాడతారు. ఈ కట్నాలు కూడ కుదిరిన పిదప తరువాత పెళ్ళి జరగడానికి తొలి అడుగు పడుతుంది.

నిశ్చితార్థం :

వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం). తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు “నిశ్చయ తాంబూలం”. వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఆంగ్లంలో “ఎంగేజ్ మెంట్” అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు. సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి.

స్నాతకం :

పెళ్లిరోజుకు ఒకరోజు ముందర “స్నాతకం” అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ “సంస్కారం”, ప్రధానంగా, వరుడిని “బ్రహ్మచర్యం” నుండి “గృహస్థాశ్రమం” స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో “గృహస్థాశ్రమం” స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని “సత్యాన్న…” అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది. “సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు” అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, “వరుడికి శుభం కలుగుగాక” అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు.

జీలకర్ర, బెల్లము :

శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెరతొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర , బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు (ంఅతెరీల్ శ్చిఎంతిస్త్స్) జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు (ఫొసితివె ఎలెచ్త్రిచ్ చర్గె) ఉత్పత్తి అగునని వర్ణించారు. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించ బడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేసారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని తెలుస్తుంది. అలాగే శ్రాస్త్రరిత్య ఈ మీశ్రమానికి బ్రహ్మరంద్రాన్ని తెరిపించే శక్తి ఉంతుందట!.

మంగళసూత్రధారణ :

వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో ‘మంగళ’ అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.

తలంబ్రాలు :

మంగళ సూత్రధారణ పూర్తి అయిన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకొంటారు. దీనినే అక్షతారోహణం అంటారు. ‘క్షత’ అంటే విరుగునది- ‘అక్షత’ అంటే విరగనిది. అనగా విడదీయరాని బంధము కావలెనని భావము. తలన్+బ్రాలు అంటే తల నుండి క్రిందికి జారునవి అని ఈ క్రింది మంత్రముతో పురోహితుడు తలంబ్రాల కార్యక్రమము కొనసాగిస్తాడు.

వధువు కాళ్ళకి మేట్టలు ఎందుకు వరుడు తొడుగుతాడు :

వధువుకీ వరుడు పెళ్లి రోజున కాలి రెండోవ వేలుకీ మేట్టలు తొడగడం మన ఆనాదిగా వస్తున్న సంప్రదాయం. స్త్రీ అబరణలుఅన్నీ సామాన్యంగా యోగ శాస్త్రంలోనీ నాడులుకి సంభందేంచి ఉన్నయీ. స్త్రీలు వారు చేతికి వేసుకొనే గాజులు, కాళీ మెట్టలు రెండు కూడా సంతానాభిరుదీకి, సుఖ ప్రసవం నాకి అనుకులించే నాడులనూ సున్నితంగా నొక్కుతు ఉంటాయీ. అందు వల్ల మన పూర్వికులు వధువు కి కాళ్ళ మెట్టలు ఆపాదించారు. ఈ మేట్టలు వధువుకి వివాహీత అని చెప్పే మరో గుర్తు. వివాహతంతులో వధువు పాదాన్నిరోకలి ఫై ఉంచీ వరుడు ఆమే కాలి వేలుకీ మెట్టలు తోడుగుతారు వీటినీ ఒక్కక్క ప్రాంతంలొ ఒక్కో రకంగా తొడుగుతారు.

సప్తపధీ(ఏడు అడుగులు ):

హిందూ వివాహవిధుల లో ప్రధానమైనధీ .సప్తపధీ(ఏడు అడుగులు ).దేనీ తరువాతే వధువు వరుడు భార్య భర్తలు గా పరిగణీఒచ భడతారు .వరుడు తనతో పాటు వధువు ను అగ్నీ హొత్రంనీకీ తూర్పునకు గానీ ,ఉత్తరానీకి గానీ కుడి కాలు ముందుగా పేడుతు ఏడు అడుగులు నడిపించాలి.ఈ ఏడు అడుగులకి ఒకొక అర్ధం ఉంది .

Telugu people marriage traditions-importants

ఒకటవ అడుగు = దేవుడా సమృదిగా ఆహరం సమకూర్చు గాక

రెండోవ అడుగు = ఆరోగ్యం , భలం ప్రసాదించు గాక

మూడవ అడుగు =పూజలు ,వ్రతాలు ఆచరించే శక్తీ నీ ప్రసాదించు గాక

నాలుగోవ అడుగు =సిరి సంపదలు ,సుఖాలూ అందచేయు గాక

ఐదవ అడుగు = పశుసంపతీ నీ ప్రసాదించు గాక

ఆరోవ అడుగు = జీవితం లో పంచభూతాలు సానుకూలం గా ఉంటూ ఆనందానీ పంచి ఇచు గాక

ఎడవ అడుగు = జీవనా విదులను నిర్వహించటంలో సమర్ధతను ఇచ్చు గాక అని అర్దం

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 1 visits today)