బెంగళూరుకి చెందిన ఆనంద్, పునీత దంపతులు తమ ఇద్దరు పిల్లలు యష్(12), దృతి(8) తో కలిసి ఒక గొప్ప ప్రయాణం చేశారు. ఈ నలుగురు తమ కారులో బెంగళూరు నుండి ప్యారిస్ వరకు చేరుకొని చరిత్ర సృష్టించారు.వీరి ప్రయాణం 11 దేశాల గుండా సాగింది. ఎన్నో వ్యయ ప్రయాసలకొడ్చి 111 రోజుల్లో 22,780 కిలోమీటర్లు ప్రయాణించి ప్యారిస్ చేరుకున్నామని మరియు ఈ ప్రయాణం అద్భుతమైన జ్ఞాపకాలని మిగిల్చిందని ఆనంద్ తెలిపారు.
ముందుగా అన్ని దేశాల ఎంబసీస్తో వీసాలు తీసుకున్న తర్వాత బెంగళూరులో ఏప్రిల్ 8, 2015 న వీరి ప్రయాణం మొదలయ్యింది. నేపాల్లో భూకంపం వచినప్పుడు వీరు నేపాల్లోనే 5 రోజులు చిక్కుకుపోయారు. తర్వాత తమ ప్రయాణాన్ని ప్యారిస్ వరకు కొనసాగించి తిరుగు ప్రయాణం మాత్రం విమానంలో చేశారు. వారు తమ ప్రయాణం మొత్తాన్ని తమ
ఫేస్బుక్ పేజ్లో ఫోటోస్ తో సహా వ్రాసుకున్నారు. కృషి, పట్టుదలతో ప్రయత్నిస్తే అన్ని సుసాధ్యం అని ఈ కుటుంభం మరోసారి నిరూపించింది.
(Visited 5,856 times, 1 visits today)