Home / Political / ముగ్గురి ప్రాణాలు తీసిన పతంగి మాంజా….

ముగ్గురి ప్రాణాలు తీసిన పతంగి మాంజా….

Author:

ఆనందం కోసం పతంగులు ఎగురవేస్తే, వాటి దారంతో గొంతులు తెగి ఢిల్లిలో ముగ్గురు చనిపోయారు మరియు కొందరు గాయ పడ్డారు.. ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం రోజున ఢిల్లిలో పతంగులు ఎగురవేయడం ఆనవాయితి. కాని ఈ సారి చాల మంది సాధారణ దారానికి బదులు గ్లాసు పూత పూసిన చైనా దారం (మాంజా) వాడటంతో ఈ ప్రమాదాలు జరిగాయి.

Kite String Killed 3 people

3 సంవత్సరాల సాంచి గోయల్ మరియు 4 సంవత్సరాల హ్యారి, స్వతంత్ర దినోత్సవ సంబరాలను చూడడానికి తమ తండ్రి కారులోని సన్ రూఫ్ నుండి తలలు బయటకు పెట్టి ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో రోడ్డుపై వేలాడుతున్న మాంజా దారం వారిద్దరి గొంతులను కోసేసింది. ఎం జరుగుతుందో తెలుసుకునే లోపే చిన్నారులు ప్రాణాలు విడిచారు.. ఇలాంటి ఇంకో సంఘటణ దక్షిణ ఢిల్లిలో జరిగింది. తన బైకుపై వెళ్తున్న 22 యేళ్ళ జఫర్ ఖాన్ గొంతుకు కూడ మాంజా చుట్టుకొని చనిపోయాడు. కొంత మంది ఆనందం కోసం పతంగులు ఎగురవేసి వాటిని అలా వదిలేయడం వలనే ఈ ప్రమాదాలు జరిగాయి. దయచేసి ప్రమాదకరమైన మాంజాను ఇక ముందు పతంగులు ఎగురవేసేటప్పుడు వాడకండి ఇతరులను గాయపరచకండి.

(Visited 42 times, 1 visits today)