మద్యం మత్తులో సరదా కోసం చేసిన ఒక పని ఇద్దరు యువకుల ప్రాణాలు తీసింది. ఆనందంగా గడుపుదామని విహార యాత్రకు వెళ్ళిన వారి స్నేహితులకు విషాదాన్ని మిగిలించింది. మద్యం తాగుతూ ఆ మత్తులో కిక్కు కోసం సాహస విన్యాసాలు చేయబోయిన ఇద్దరు యువకులు కాలు జారి 2వేల అడుగుల లోతున్న లోయలో పడిపోయారు. ఈ సంఘటణ మహారాష్ట్రలోని అంబోలి ఘాట్ దగ్గర జరిగింది. ఆ ప్రామాదపు వీడియోను క్రింద చూడండి.
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఒక ఫౌల్ట్రీ ఫామ్లో పని చేస్తున్న ఏడుగురు యువకులు సోమవారం(జులై31)న విహారయాత్ర కొరకు మహారాష్ట్రలోని అంబోలి ఘాట్ కు వెళ్ళారు. అక్కడ మద్యం త్రాగారు, అందులో ఇమ్రాన్ గరాడి (26), ప్రతాప్ రాథోడ్(21) అనే ఇద్దరు యువకులు మద్యం మత్తులో సరదా కొరకు అంబోలి బ్రిడ్జి రేలింగ్ అంచుపై నిలబడి మద్యం సీసాతో సాహసకృత్యాలు చేసారు. అలా చేస్తున్న సమయంలోనే పట్టితప్పి బ్రిడ్జి రేలింగ్ పై నుండి లోయలోకి పడిపోయారు. ఇంతవరకు వారి శవాలు దొరకలేదు. ఈ సంఘటణను జరుగుతున్న సమయంలో ఇంకో యువకుడు వీడియో తీయడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది. దయచేసి సరదా కోసం ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకండి.