Home / General / పెళ్లి ఖర్చులకి లెక్క చెప్పాల్సిందే – సుప్రీం కోర్టు

పెళ్లి ఖర్చులకి లెక్క చెప్పాల్సిందే – సుప్రీం కోర్టు

Author:

ప్రతి సంవత్సరం మన దేశంలో పెళ్లిళ్ల సందర్భంగా జరిగే బిజినెస్ విలువ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలకి పైనే, డబ్బులు ఉన్నవాళ్ళ నుండి పేదవాళ్ల వరకు తమకు ఉన్నంతలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలనే చూస్తుంటారు, మధ్య తరగతి వారు కట్న కానుకలు కాకుండా యావరేజ్ గా ఒక పెళ్లి కోసం 10 లక్షలు ఖర్చు చేస్తున్నారు, ఇంకా ఎక్కువ ఆస్తులు ఉన్నవారి పెళ్లి ఖర్చులు కోటి రూపాయలు దాటిపోతున్నాయి. అయితే పెళ్లి ఖర్చుల విషయంలో సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

పెళ్లి ఖర్చులు రిజిస్టర్ చేయాలి

పెళ్లి టైంలో పెట్టే ఖర్చు వివరాలను విధిగా వెల్లడించేలా.. నిబంధనలు రూపొందించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. వధూవరులకు చెందిన రెండు కుటుంబాలు ఖర్చు వివరాలను మ్యారేజ్ రిజిస్ట్రార్ దగ్గర నమోదు చేసేలా నిబంధనలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో పెళ్లి తర్వాత కట్నం విషయంలో తలెత్తే వివాదాలకు ఇది పరిష్కారంగా ఉంటుందని కోర్టు భావిస్తోంది. కట్నం ఇవ్వటం, తీసుకోవటం నేరం అయినా.. లాంఛనాల కింద వాటిని చూపిస్తూ.. కోర్టుల్లో కేసులు వేస్తున్నాయి. ఆ సమయంలో నిజంగా ఇచ్చారా.. తీసుకున్నారా అనే విషయాలను తేల్చటం కష్టం అవుతుంది. దీంతో పెళ్లి సమయాల్లో వధూవరుల కుటుంబాలు విధిగా పెళ్లి ఖర్చులను రిజిస్ట్రార్ చేయించే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని.. సుప్రీంకోర్టు ఆదేశించింది.

వివాహ సమయంలో చేసే ఖర్చులో కొంత భాగాన్ని వధువు పేరిట డిపాజిట్‌ చేయడం ద్వారా వారి భవిష్యత్ కు భరోసా కల్పించవచ్చని వ్యాఖ్యానించింది కోర్టు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిబంధనలు రూపొందించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. ఇంతకు ముందున్న చట్టాల్లో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

(Visited 1 times, 1 visits today)