భగవద్గీత గ్రంథంలో ఒక మనిషి ఉన్నతంగా ఎలా జీవించాలో.., సమాజం, ఇతరుల పట్ల ఎలా ఉండాలో..చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రపంచవ్యాప్తగా కొన్ని దేశాలు పర్సనాలిటీ డెవలప్ మెంట్ లాంటి కోర్సులను మన భగవద్గీతనే తీసుకుంటారంటే అతిశయోక్తి కాదు. అంతటి పవిత్రమైన భగవద్గీత అంటే తనకెంతో ఉష్టమంటున్నాడు ఓ హీరో. అదికూడా ఏ టాలీవుడ్, బాలీవుడ్ హీరో కాదండీ..ఏకంగా హాలీవుడ్ హీరో చెప్పడం గ్రేట్. ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ముంబయిలో సందడి చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘బ్రైట్’ చిత్రం డిసెంబర్ 22న భారత్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల సందర్భంగా విల్స్మిత్ భారత్ చేరుకున్నారు.విల్ స్మిత్తో పాటు మరో నటుడు జోయెల్ ఎడ్గెర్టాన్ కూడా ముంబయిలో సందడి చేస్తున్నారు. విల్స్మిత్ భారత్ వచ్చిన సందర్భంగా ఓ ప్రముఖ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ గురించి అక్షయ్కుమార్తో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు.
బాలీవుడ్లో పార్టీలు చాలా గ్రాండ్గా జరుపుకొంటారని.. తాను ముంబయికి రావడం ఇది మూడోసారన్నారు. అయితే భారత్కు రావడం నాలుగో సారి అన్నారు. తనకు అక్షయ్కుమార్ అంటే చాలా ఇష్టమని.. ఆయన ఇంట్లోనే ఉండిపోవాలని అనిపిస్తుందన్న ఆయన.. పోయినసారి ముంబయి వచ్చినప్పుడు అక్షయ్ ఇంట్లోనే డిన్నర్ చేశాను అని చెప్పారు. భారత్లో తనకు నచ్చిన విషయం.. భారతీయ చరిత్ర అంటే చాలా ఇష్టమని.. చెప్పాలంటే భగవద్గీతను తొంబై శాతం చదివాను అని చెప్పిన విల్ స్మిత్.. భారత్ వచ్చినప్పుడు భగవద్గీత చదువుతుంటే తనలో అర్జునుడు ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. త్వరలో రిషికేశ్ వెళుతున్నాను. అక్కడ చాలా రోజులు గడపాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు విల్ స్మిత్.