Home / Political / ఫిబ్ర‌వ‌రి 20 నుంచి సేవింగ్స్ ఖాతాదారులు రూ.50వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఫిబ్ర‌వ‌రి 20 నుంచి సేవింగ్స్ ఖాతాదారులు రూ.50వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

Author:

పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వస్తుంది. ఇప్పటివరకు ప్రతి వారానికి బ్యాంకు క్యాష్ విత్‌డ్రాయ‌ల్స్‌పై ఉన్న 24 వేల పరిమితిని ఫిబ్ర‌వ‌రి 20 నుంచి 50 వేలకు పెంచనుంది. ఈరోజు ఆర్బీఐ ప్రకటణానుసారం ఫిబ్ర‌వ‌రి 20 నుంచి అందరూ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతానుండి వారానికి రూ.50వేలు వ‌ర‌కు విత్‌డ్రాచేసుకోవ‌చ్చు. ఫిబ్ర‌వ‌రి 20 వరకు పాత పద్దతి ప్రకారం 24 వేలు తీసుకోవచ్చు.

Atm-Withdraw-Limit

అంతేకాకుండా మార్చి నాటికి కొత్త కరెన్సీ అందరికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న ఆర్బీఐ, మార్చి 13 తరువాత విత్‌డ్రా లిమిట్ ఎత్తేస్తామని కూడా ప్రకటించింది. అంటే మార్చ్ 13 తర్వాత మీ ఖాతా నుండి ఎంత డబ్బైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. అదే సమయంలో 3 లక్షల పైన నగదు చెల్లింపులపై 100% జరిమాన విధించే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం.

(Visited 432 times, 1 visits today)