Home / Inspiring Stories / బంపర్ ఆఫర్: కేవలం ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్..!!!

బంపర్ ఆఫర్: కేవలం ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్..!!!

Author:

ఇప్పుడు ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలంటే 8 వేల నుండి 13 వేల రూపాయల పెట్టాల్సిందే, స్మార్ట్ ఫోన్ల అమ్మకంలో పోటీ తీవ్రంగా పెరగటంతో చాలా కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లని ఇచ్చి ఎలాగోలా తమ ఫోన్ లని అమ్ముకుంటున్నారు, Red Mi, Xiaomi Mi లాంటి ఫోన్లతో ఇప్పటికే స్మార్టుఫోన్ల మార్కెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న షియోమీ కంపెనీ ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ తో వచ్చింది, చైనాకి చెందిన ఈ కంపెనీ భారత్ మార్కెట్ లోకి వచ్చి రెండేళ్లవుతున్న సందర్భంగా కేవలం ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్లని అమ్మాలని నిర్ణయిచింది.

Xiaomi-Mi-2nd-Anniversary-sale-from-July-20-to-22

జులై 20 నుంచి 23 వరకు వర్తించే ఈ ఆఫర్ పై వినియోగదారులు అప్పుడే ఆసక్తి పెంచుకున్నారు. 20 నుంచి 23 తేదీల మధ్య ప్రతి రోజూ రెండు గంటలకు ఫ్లాష్ సేల్ పేరిట ఫేస్ బుక్ ద్వారా షియోమీ వినియోగదారులకు ఈ ఆఫర్ ను అందించనుంది. ఆఫర్ లో భాగంగా కేవలం రూపాయి ధరకే ఫోన్లు – పవర్ బ్యాంక్ లు – బ్లూటూత్ స్పీకర్లు అందజేయనుంది. తొలిరోజు 10 షియోమీ ఎంఐ ఫోన్లు ఐదు – 100 పవర్ బ్యాంకులు – రెండో రోజు రెడ్ మీ నోట్ 3 ఫోన్లు పది – 100 ఎంఐ బ్యాండ్ లు – ఆఖరి రోజున ఎంఐ మ్యాక్స్ ఫోన్లు పది – 100 ఎంఐ బ్లూటూత్ స్పీకర్లను వినియోగదారులకు అందజేయనుంది.

ఈ ఆఫర్ కేవలం ఫేస్ బుక్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఆన్లైన్ షాపింగ్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉండదని ప్రకటించారు, దీనికోసం యూజర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు కస్టమర్లు ఫ్లిప్ కార్ట్ – అమేజాన్ – స్నాప్ డీల్ వంటి ఆన్ లైన్ పోర్టల్స్ ద్వారా వీటిని కొనుగోలు చేసేవారు. అలా కాకుండా నేరుగా వినియోగదారులను దగ్గర చేసుకునేందుకు షియోమీ ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. జూలై 19 లోగా పేస్ బుక్ లో రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలు ఉంచుతామని షియోమీ వెల్లడించింది. దీనిపై మరింత సమాచారం కొరకు వారి వెబ్‌సైట్ చూడండి.

Must Read: ఏటియం కార్డు లేకున్నా ఆధార్ కార్డుతో డబ్బులు డ్రా చేసుకోవచ్చు.

(Visited 5,234 times, 1 visits today)