Redmi 5A స్మార్ట్ ఫోన్ విడుదల అయినప్పటి నుండి ఈ ఫోన్ కి ఫుల్ డిమాండ్ నెలకొని ఉంది, కేవలం రూ.5000 లోపు ఇన్ని అద్భుతమైన ఫీచర్ లతో ఏ ఫోన్ లేకపోవడంతో Redmi 5A వినియోగదారులని విపరీతంగా ఆకట్టుకుంది, ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ వస్తున్న ఆన్ లైన్ ఫ్లాష్ సేల్స్లో ఈ ఫోన్ హాట్ కేకులా అమ్ముడవుతోంది. ఆన్లైన్లో షియోమీ రెడ్మీ 5ఏ 2జీబీ ర్యామ్ మోడల్ రూ.4,999 ఉండగా ఆఫ్లైన్ స్టోర్స్లో రూ.5,499కు విక్రయిస్తున్నారు. ఇక ఇదే ఫోన్కు చెందిన 3జీబీ ర్యామ్ మోడల్ ఆన్లైన్లో రూ.6,999కు ధరకు లభిస్తుండగా, ఆఫ్లైన్లో దీన్ని రూ.7,499 ధరకు విక్రయిస్తున్నారు.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ ఫోన్ రూ.4000 లకే లభిస్తుంది, రిటైల్ సూపర్ మర్కెట్స్ స్టోర్ కంపెనీ అయిన బిగ్ బజార్ సంస్థ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఈ ఆఫర్ ని ప్రకటించింది, తగ్గింపు ధర పొందాలంటే వినియోగదారులు ఫ్యూచర్ పే వాలెట్లో నగదు జమ చేసి దాంతో ఈ ఫోన్ను కొనాల్సి ఉంటుంది. అప్పుడు రూ.1000 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇలా ఫోన్ ధర తగ్గుతుంది. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్కు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఫోన్ను కొంటే 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్పెషల్ ఆఫర్ ఈ నెల 28వ తేదీ వరకు లేదా స్మార్ట్ ఫోన్ లు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తుంది.