భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు బ్యాడ్మింటన్ పరికరాల తయారీలో రారాజు అయిన యోనెక్స్ కంపెనీ క్షమాపణలు చెప్పింది, పీవీ సింధుకి యోనెక్స్ కంపెనీ స్పాన్సర్ ఉంది, అయితే యోనెక్స్ కంపెనీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి పీవీ సింధు ‘గుడ్ బై సింధు. భారత్లాంటి పేద దేశానికి చెందిన ఆటగాళ్లు ఇక మా స్పాన్సర్షిప్ పొందబోరు. ఇక మా దృష్టంతా జపాన్ యువ క్రీడాకారులపైనే’ అనే మెస్సేజ్ వచ్చింది, అయితే ఈ మెస్సేజ్ అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల వచ్చిందని యోనిక్స్ ప్రతినిధులు స్పష్టం చేశారు.
‘మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ (యోనెక్స్ డాట్ కామ్)నుంచి మాకు తెలియకుండా పోస్ట్ అయిన ఆ అసంబద్ధ మెసేజ్ కారణంగా యోనెక్స్ అభిమానులందరికీ నిజాయితీగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. మా అకౌంట్ హ్యాక్ అయింది. అంతలోనే సమస్య పరిష్కారం అయింది. మా అకౌంట్ మరింత భద్రంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. భవిష్యత్లో ఇలా జరగదు’ అని యోనెక్స్ స్పష్టం చేసింది. ఫస్ట్ మెస్సేజ్ రాగానే పీవీ సింధుతో పాటు చాలామంది అయోమయానికి గురయ్యారు, తరువాత అసలు విషయం తెలుసుకొని ఊరట చెందారు.