ఉత్తరప్రదేశ్ లో బాణాసంచా పేల్చడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. లక్నోలో జరిగే కార్యక్రమాల్లో బాణాసంచా పేల్చరాదని ఆదేశించింది. ప్రజలు ఇక మీదట బహిరంగ ప్రదేశాలల్లో బాణాసంచా కాల్చడానికి అధికారుల నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాలని సూచించింది. అటులనే టపాసులు కొనటానికి రాతపూర్వక అనుమతి, ఫోటో గుర్తింపు కార్డు ఉండాలని పేర్కొంది. ఈ నిషేధం ఈ ఏప్రిల్ 21 నుంచి అమల్లోకి రానుంది.