Home / Inspiring Stories / నలుగురు ఉగ్రవాదులతో 19 ఏళ్ల సైనికుని విరోచిత పోరాటం.

నలుగురు ఉగ్రవాదులతో 19 ఏళ్ల సైనికుని విరోచిత పోరాటం.

Author:

మరోసారి మనదేశంపై ఉగ్ర పంజా విరుచుకుపడింది. జమ్ము కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా యురిలో ఆర్మీ ప్రధాన కార్యాలయంపై జరిగిన ఉగ్ర దాడిలో 17 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. 20 మంది పైగా జవాన్లు గాయపడ్డారు. ఈ దాడి జరిగినప్పుడు బ్యారక్ లో 19 ఏళ్ల డోగ్రాకు చెందిన సైనికుడు ఇతర సైనికుల సహాయం అవసరం లేకుండా ఒక్కడే ఉగ్రవాదులతో పోరుకు దిగాడు. నలుగురు ఉగ్రవాదులు కాల్పులు  జరుపుతున్న ఎటువంటి ధైర్యాన్ని కోల్పోకుండా ఎదురుదాడి చేస్తూనే  ఉన్నాడు. కొంత సమయం తర్వాత మన సైనికుడు జరుపుతున్న కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోయాడు. దానితో  మన సైనికుడికి వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు మరింత రెచ్చిపోయి ఎదురుకాల్పులు జరుపుతూ మిగిలిన ముగ్గురితో హోరాహోరీగా కాల్పులు జరిపాడు. కొంత సమయం తర్వాత మన సైనికుడికి హెల్మెట్ కు బుల్లెట్ తగిలి తలకు చాలా పెద్ద గాయం జరిగింది.

19-year-old-soldier-and-four-militants-fighting

ఇంతలో మన ఇతర సైనికులు వచ్చి గాయపడ్డ సైనికుణ్ణి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురి ఉగ్రవాదులు  ఆర్మీ ఆఫీస్ రెండో ప్లోర్లోకి వెళ్లి కాల్పులు మొదలుపెట్టారు. దీనిని గమనించిన మన పారా కమాండోలు వారిని వెంబడించి మట్టుబెట్టారు. ఒక్కడే చాలా సమయం నాలుగురు ఉగ్రవాదులతో పోరాడి అందులో ఒకరిని మట్టుబెట్టడంతో ఆ సైనికుడిని సోషల్ మీడియాలో ఈ వార్తా పోస్టులు చేస్తూ అభినందిస్తున్నారు  భారత పౌరులు.

(Visited 12,493 times, 1 visits today)