Home / Political / ఏసీ వాడి కరెంటు బిల్లు పెంచుతున్నారని భార్యనీ, కొడుకునీ చంపేసాడు

ఏసీ వాడి కరెంటు బిల్లు పెంచుతున్నారని భార్యనీ, కొడుకునీ చంపేసాడు

Author:

రైల్వే శాఖ రిటైర్డ్ ఉద్యోగి అయిన పాల్ పైనడతు అనే ఆ వ్యక్తి వయసు 85 ఏళ్ళు. ఆయన భార్యకు 74 ఏళ్లు, కొడుకు వయసు 54 ఏళ్లు. వీరిద్దరూ ఏసీ ఎక్కువగా ఉపయోగిస్తూ కరెంటు బిల్లు పెంచేస్తున్నారని ఏమాత్రం కనికరం లేకుండా పెద్ద గునపం తీసుకుని నిద్ర పోతున్న ఇద్దరినీ ఇద్దరినీ పొడిచి చంపేశాడు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కేరళలోని అంగమలీ పట్టణంలో జరిగిన ఈ ఘోరం ఇప్పుడు అక్కడ కలకలం రేపుతోంది.

తాను చేసిన ఆ దారుణమైన హత్య గురించి వెంటనే కతార్ దేశంలో ఉన్న తన చిన్న కొడుక్కి ఫోన్ చేసి చెప్పాడు. ఏసీ ఎక్కువగా వాడుకుంటూ కరెంటు బిల్లు పెంచేస్తున్నారన్న కోపంతో అమ్మను, అన్నని చంపేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేశాడు.ఆ మాటలకు షాక్ కి గురై, కంగారు పడిన ఆ రెండో కొడుకు వెంటనే ఇంటికి దగ్గరలో ఉండే తన బంధువులకు ఫోన్ చేయగా, వారు పోలీసులను అప్రమత్తం చేశారు. అయితే పోలీసులు వచ్చేటప్పటికి పాల్ తానూ ఆత్మ హత్య చేసుకునే పనిలో ఉన్నాడు. మరీ విషాదం ఏమిటంటే, హత్యకు గురైన పాల్ భార్య, పెద్ద కొడుకు ఇద్దరూ కుడా గుండె జబ్బులతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

వీరిద్దరినీ చంపిన పాల్, తాను కూడా ఉరేసుకుని చనిపోదామని ప్రయత్నం చేశాడు. అందుకోసం నిచ్చెన తెచ్చుకున్నాడు కానీ వయసువల్ల వచ్చిన బలహీనం తో ఆ నిచ్చెన ఎక్కలేకపోయాడు… అప్పటికే పోలీసులు అక్కడికి చేరుకోవటం తో అతని ఆత్మహత్యా ప్రయత్నం ఆగిపోయింది. గత కొద్ది రోజులుగా తన కుటుంబ సభ్యులు ఏసీని ఎక్కువగా వాడుతున్నారని, దీనివల్ల కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని, కేవలం పెన్షన్తో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమవుతోందని, అందుకే వారిని చంపినట్లు పాల్ పోలీసుల విచారణలో తెలిపాడు.

(Visited 714 times, 1 visits today)