Home / Inspiring Stories / ముస్లింలని కాపాడడానికి కత్తులు దూసిన హిందువులు, సిక్కులు..!!!

ముస్లింలని కాపాడడానికి కత్తులు దూసిన హిందువులు, సిక్కులు..!!!

Author:

భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అని ప్రపంచంలో అందరికి తెలుసు, చాలా మంది ఎన్నిరకాల కుట్రలు, అల్లర్లు చేసిన మన దేశం ప్రజల మధ్య ఉన్న బంధాన్ని తెంచలేరని మరోసారి నిరూపితం అయింది, గత నెలరోజులుగా కాశ్మీర్ అల్లకల్లోలంగా ఉన్న సంగతి మనకి తెలిసిందే, ఒక కరుడు కట్టిన ఉగ్రవాదిని చంపినందుకు పాకిస్థాన్ కి చెందిన వ్యక్తులు కాశ్మీర్ లో అల్లర్లు చేస్తున్నారు, అక్కడ ఇద్దరు ముస్లింలు అల్లరి మూకలని, పోలీసుల కర్ఫ్యూ ని సైతం లెక్క చేయకుండా బయటకు వచ్చి కష్టాలలో ఉన్న హిందూ కుటుంబాన్ని కాపాడారు, ఇప్పుడు అలాంటి సంఘటనే పంజాబ్ లో జరిగింది.

ముస్లింల రక్షణ కోసం కత్తులు దూసిన సిక్కులు,చేతులు కలిపిన హిందువులు

పంజాబ్ లో కాశ్మీర్ లో జరుగుతున్న అల్లర్లకి వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు, ఈ ర్యాలీలో శివసేన వారు ముస్లింల షాపులని బలవంతంగా మూసివేయించారు, దీనిపై అక్కడి ముస్లిం పెద్దలు అధికారులకి ఫిర్యాదు చేయాలనీ అనుకున్నారు, ముస్లింలు మసీదులో నమాజ్ చేస్తుండగానే శివసేన కార్యకర్తలు వచ్చి వారి పైకి రాళ్ళూ విసరడం, పెద్దగా అరవడం చేస్తూ మసీదు ఎదురుగా పార్కింగ్ చేసిన వాహనాలను ధ్వంసం చేశారు, మసీదు లోపలకి వెళ్లి రాళ్ళూ వేయాలనే ప్రయత్నం చేస్తున్నారు, శివసేన మూక చేస్తున్న దాడిని గమనిస్తున్న చుట్టుపక్కలున్న సిక్కులు కత్తులు దూసి పరుగెత్తుకొచ్చి శివసేన మూకను ఎదుర్కొన్నారు, వీరికి చుట్టుపక్కల ఉన్న హిందువులు కూడా కలిశారు, కొంతమంది ముస్లింలు కూడా వారితో చేరి శివ సేన గుంపును తరిమి కొట్టారు, అప్పటి వరకు రెచ్చిపోయిన శివసేన గుంపు వీరి ఐక్యతని చూసి పారిపోయారు.

కాశ్మీర్ జరుగుతున్న అల్లర్లకు పంజాబ్ లో ఉంటున్న ముస్లింలకు ఏమాత్రం సంబంధం లేదు, వారు భారతీయులుగానే అందరితో కలిసి బతుకుతున్నారు, శివసేన వారు దాడి చేసేది ముస్లింల పై కాదు భారతీయుల పై అని భావించి వారిని కాపాడి అక్కడ ఉన్న హిందువులు, సిక్కులు భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం అని మరోసారి నిరూపించారు.

(Visited 1,718 times, 1 visits today)