Home / Political / అమ్మ అస్తమయం.

అమ్మ అస్తమయం.

Author:

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత (68) సోమవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. ఈ విషయం తెలిసి యావత్ తమిళనాడు కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. 75 రోజులుగా అనారోగ్యంతో మృత్యువుతో పోరాడిన అమ్మ చివరకు ఆ పోరులో ఓడి అందరిని దుఖసాగరంలోకి నెట్టారు.  అమ్మకు చికిత్స చేసిన అపోలో ఆసుపత్రి యాజమాన్యం అమ్మ చనిపోయిందంటు నిన్న రాత్రి 11.30 గంటలకు ప్రకటించింది.

jayalalitha-died

సినిమా రంగం నుండి ఎంజీఆర్‌ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత అనతి కాలంలోనే గొప్ప నాయకురాలిగా మారారు. 1991 లో మోదటిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన అమ్మ తన పథకాలతో పేదలను ఆదుకున్నారు. అమ్మ ప్రవేశ పెట్టిన అమ్మక్యాంటీన్‌, అమ్మ ఉప్పు, అమ్మ సిమెంట్‌, అమ్మ సెల్‌ఫోన్‌ వంటి పలు పథకాలు ప్రజలకు బాగా చేరువయ్యాయి. ప్రజల నేస్తం అమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.

(Visited 537 times, 1 visits today)