దాదాపు 75 రోజుల సుదీర్ఘ కాలం పాటు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన జయలలిత చివరకు తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో తమిళ ప్రజలు అమ్మగా పూజించే జయకు సంబంధించిన ఆసక్తికర అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సాధారణ కుటుంబంలో జన్మించిన జయలలిత ఏకంగా తమిళనాడు రాష్ట్రానికి ఆరు సార్లు సీఎంగా వ్యవహరించారంటే మాములు విషయం కాదు, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో అమ్మగా నిలిచిపోయిన జయలలిత గారికి జరిగిన ఒక అవమానాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
జయలలిత గారికి రాజకీయ గురువైన ఎంజీఆర్ గారి అంతిమ యాత్రలో ఎంజీఆర్ కుటుంబ సభ్యులు చేసిన అవమానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఎంజీఆర్ గారికి జయలలిత అత్యంత సన్నిహితంగా మెలగడం ఎంజీఆర్ భార్య జానకి కి ఇతర కుటుంబసభ్యులకి ఇష్టం ఉండేది కాదు, ఎంజీఆర్ చనిపోయిన తరువాత ఆయన పార్థీవ దేహం ఉన్న వాహనం పైకి ఎక్కాలని ప్రయత్నిస్తున్న జయలలితని ఎక్కకుండా కొట్టి, నెట్టివేసిన దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి.