తమిళ రాజకీయాలలో మరో సంచనలం నమోదయ్యింది, ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం తన రాజీనామాను ఉపసంహరించుకోనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా అమ్మ, తనను పార్టీ కోశాధికారిగా నియమించిందని, తాను పార్టీకి ఎటువంటి ద్రోహం చేయలేదని అందుకే తనను ఆ పదవి నుండి తప్పించే అధికారం ఎవరికి లేదని కూడా ప్రకటించారు పన్నీర్ సెల్వం. అవసరమైతే అసెంబ్లీలో తన బలం నిరూపించుకుంటానని కూడా తెలిపారు పన్నీర్. ఆదివారం నుండి రోజుకో మలుపు తిరుగుతున్న తమిళ రాజకీయాలు ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనపడటం లేదు.
అమ్మ అనారోగ్యాంతో ఆసుపత్రిలో చేరినప్పుడు శశికళ ఎవరిని అమ్మతో మాట్లాడకుండా అడ్డుకుందని, అమ్మ మృతిపై అనుమాణాలున్నాయి అందుకే అమ్మ మృతిపై సుప్రీం కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపిస్తామని కూడా ప్రకటించాడు. గవర్నర్ చెన్నై రాగానే కలిసి తన అభిప్రాయం తెలుపుతానని, శశికళ కేవలం తాత్కాళిక పార్టీ కార్యదర్శి అని అమేకు అసలు తనను పార్టీ పదవి నుండి తొలగించే అధికారం లేదని అవేదన వ్యక్తం చేసారు పన్నీర్. ఈ విషయం లో బిజేపీ పార్టీ కుట్ర ఏమి లేదని కూడా ప్రకటించాడు. దీనిపై శశికళ స్పందన ఏలా ఉంటుందో చూడాలి.