ప్రభుత్వ ఆఫీస్ లలో ఏదైనా పని జరగాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బుని లంచం రూపంలో సమర్పించుకోవాల్సిందే, లంచం ఇవ్వకుంటే అసలు పనే కాదు అనేంతగా ప్రభుత్వ ఆఫీస్ లు అవినీతిలో కూరుకుపోయాయి, ఎక్కడో ఒక చోట నిజాయితీగా పని చేసే అధికారులు ప్రజలని లంచం కోసం పీడించకుండా ఉంటారు, ప్రభుత్వ ఆఫీస్ లలో లంచం తీసుకునే సంస్కృతిని పారద్రోలడానికి కేరళ ప్రభుత్వ ఉద్యోగి ఒక కొత్త మార్గంలో తనవంతు ప్రయత్నిస్తూ అందరి చేత మన్ననలు అందుకుంటున్నాడు.
రళకు చెందిన అబ్దుల్ సలీమ్ పల్లియల్తోడి అంగడిపురం పంచాయతీ ఆఫీసులో క్లర్క్గా పనిచేస్తున్నాడు. లంచం అనే మాట తనకు చిరాకు తెప్పిస్తుందని చెబుతున్నాడు. ప్రజలకు సేవచేసేందుకు ప్రభుత్వం తనకు రోజుకు రూ.811 నెలకు రూ.24,340 చెల్లిస్తోందంటూ తను పనిచేసే డెస్క్ వద్ద ఒక బోర్డు ఉంచాడు. అంతేకాదు తన సేవలతో ప్రజలు తృప్తి పొందకుంటే తనకు చెప్పాల్సిందిగా ఆ బోర్డుపై రాసి ఉంచాడు.
గతమూడేళ్లుగా ఆ పంచాయతీ ఆఫీసులో పనిచేస్తున్న సలీం తన పే స్కేల్ మారినప్పుడల్లా క్రమం తప్పకుండా తన జీతం బోర్డుపై రాస్తున్నట్లు ఆఫీస్ స్టాఫ్ చెబుతోంది. తమ పనులపై అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు సలీం పెట్టిన బోర్డును చూసి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. దీంతో అవినీతి లేని సమాజం కోసం సలీంలాంటి వ్యక్తులు అవసరమని చాలామంది తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. ఇందులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఉన్నారు.
40శాతం పోలియోతో బాధపడుతున్నప్పటికీ సలీం ఏనాడు అది చూసి కుంగిపోలేదు, ప్రజలు ఎలాంటి సహాయం కోరిన తనకు చేతనైనంత సహాయం చేస్తాడు, చుట్టుపక్కల గ్రామాలలో పర్యటిస్తూ ప్రజలకి తమ హక్కుల గురుంచి అవగాహన కూడా కల్పిస్తున్నాడు, అలాగే ఆ ప్రాంతంలో దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాయాలలో లంచం అనేది లేకుండా పని జరుగుతుంది అంటే అది సలీమ్ కృషి వల్లనే అని అక్కడి అధికారులు , ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు, తన కోసం కాకుండా ప్రజల కోసం ఆలోచిస్తున్న సలీంకి హాట్స్ ఆఫ్.
Appreciate the honesty & spirit of Mr. Abdul Saleem, Panchayat clerk in #Kerala. Public service should be the motto of every Govt employee. pic.twitter.com/kRH1qMLWgL
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 29, 2017