ఎన్నో సంవత్సరాల నుండి సినిమాల్లో నటిస్తున్నప్పటికీ “అఆ” సినిమాతో టాలెంట్ ప్రూవ్ చేసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకరింగ్ చేసిన బిగ్ బాస్ షోతో అభిమానులని సంపాదించుకున్న నటి హరితేజ కి ఇప్పుడు సినిమా అవకాశాలు క్యూ కట్టేశాయి, అటు సినిమాలతో పాటు యాంకర్ గా కూడా చేస్తున్న హరితేజ.. అల్లు శిరీష్ హీరోగా వస్తున్న ” ఒక్క క్షణం ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వ్యాఖ్యాతగా చేసింది, హరితేజ తనదైన కామెడీ టైమింగ్ తో ఈవెంట్ మొత్తాన్ని సూపర్ గా నడిపించారు, ఈ షోకి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చివర్లో అల్లు అర్జున్ హరితేజకు ‘స్వీట్ వార్నింగ్’ ఇచ్చారు.
షో మధ్యలో యాంకర్ హరితేజ.. అల్లు అర్జున్ అంటే తనకెంతో ఇష్టమని ఆయనకు అభిమానినని అన్నారు. దీంతో కార్యక్రమం చివర్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ చెప్పలేదు. నాకు చాలా ఇష్టమైన నటి హరితేజ. తెలుగు ఆర్టిస్ట్లు అంటే నాకు వీక్నెస్ ఎక్కువ. ఎక్స్టార్డనరీ నటి ఆమె. చాలా చక్కగా హోస్ట్ చేశారు. థ్యాంక్యూ. నాకు అభిమానినని చెప్పారు. వేరే ఏదైనా ఫంక్షన్లో ఇలా ఇంకో హీరో పేరు చెబితే కనుక మీకు కచ్చితంగా ఫోన్ చేస్తా’ అంటూ చిరు నవ్వులు చిందించారు. అందుకు హరితేజ స్పాంటేనియస్ గా ‘ఏనీ సెంటర్ మీ పేరే’ అనడంతో స్టేజ్ సందడిగా మారింది.