విమాన ప్రయాణం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని మనకి తెలిసిందే, కానీ అలాంటి విమాన ప్రయాణాన్ని కేవలం రూ.99 తోనే మనకి అందించేలా ఎయిర్ ఏషియా ఒక బంపర్ ఆఫర్ ని ప్రకటించింది, కేవలం రూ.99 బేస్ ఛార్జీతో విమాన టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది.ఈ ఆఫర్ కేవలం బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, కోల్కతా, న్యూఢిల్లీ, పూణె, రాంచీ నగరాలకు మాత్రమే వర్తించనుంది. జనవరి 15 నుంచి 21వ తేదీలోగా ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకోని… జులై 31 వరకు ఏదైనా తేదీల్లో జర్నీ చేసేలా ఒక ఆఫర్ ని ఎయిర్ ఏషియా ప్రకటించింది.
ఈ ఆఫర్ తో పాటు విదేశాలకు వెళ్లే వారికి కూడా ఎయిర్ ఏషియా కంపెనీ మరో సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. ఎయిర్ఏషియా 10 ఆసియా-పసిఫిక్ రీజియన్(PAAC) దేశాలకు వెళ్లే ప్రయాణికులు కేవలం రూ.1,499 బేస్ఛార్జితో టికెట్ కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది. సింగపూర్, బాలీ, కౌలాలంపూర్, ఆక్లాండ్, బ్యాంకాంక్, మెల్బోర్న్, సిడ్నీ నగరాలు ఈ ఆఫర్ వర్తిస్తుంది.