జబర్దస్త్ ప్రోగ్రాంతో స్టార్ యాంకర్ గా మారి సినిమాలలో ఇంపార్టెంట్ రోల్స్ ఇప్పుడిప్పుడే చేస్తున్న యాంకర్ అనసూయ ఓవర్ యాక్షన్ తో మరొక వివాదంలో చిక్కుకుంది, అసలు ఏం జరిగిందంటే..
తార్నాకలో తన తల్లితో కలిసి స్కూల్ కి వెళ్తున్న ఒక పిల్లాడు అటుగా కారులో వెళ్తున్న యాంకర్ అనసూయని చూసి ఫోటో తీయాలని ఫోన్ చేతిలో పట్టుకున్నాడు, ఇది గమనించిన యాంకర్ అనసూయ కోపంతో ఆ పిల్లాడిని తిట్టి..అతని చేతిలోంచి ఫోన్ ని లాక్కొని నేలకేసి కొట్టింది, దాంతో అక్కడ వివాదం చోటుచేసుకుంది, ఫోటో తీయడం ఇష్టం లేకుంటే వద్దని చెప్పాలి కానీ చిన్న పిల్లాడు అని చూడకుండా తిట్టి.. ఫోన్ లాక్కొని పగలకొట్టడం ఏంటని.. ఆ అబ్బాయి తల్లి మీడియా ముందు వాపోయింది.