రామాయణం గురించి అందరికి తెలుసు ఎందుకంటే సీతారాములు మనకు ఆరాధ్య దైవాలు. రాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్లడం, రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళడం, రాముడు యుద్ధం చేసి రావణాసురుడుని చంపండం. సీతను తెచ్చుకోవడం అంత మనకు తెలుసు కానీ సీతారాములు, లక్ష్మణుడు ఏవిధంగా చనిపోయారో చాలా తక్కువ మందికి తెలుసు …..ఎందుకంటే చాలా మంది పద్మ పురాణం చదువకపోవడమే. అదే పద్మ పురాణంలో చాలా స్పష్టంగా సీతారాములు ఏవిధంగా చనిపోయారో తెలిపారు.
రాముడు సీతను లంక నుండి తీసుకువచ్చిన తర్వాత లోకం కోసం సీతకు అగ్నిప్రవేశ పరీక్ష పెడతాడు. ఈ కఠిన శిక్షలో నెగ్గుతుంది సీత. సీతను తీసుకువచ్చిన తర్వాత సీతారాముల పట్టాభిషేకం జరిగి ప్రజలను చాలా బాగా చూసుకుంటుంటాడు. ఆ సమయంలో సీత మరో సారి అగ్ని పరీక్ష ఎదుర్కోవలసి వస్తుంది. దానికి కారణం ఒక సాకలి, అతని మాటలకు బాధపడి సీతను వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టి వస్తాడు రాముడు. అలా కొద్దీ రోజుల తర్వాత మళ్ళీ రాజ్యానికి తీసుకువచ్చే సమయంలో సీతకు అగ్నిప్రవేశ పరీక్ష పెడుతాడు రాముడు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక సీత తన తల్లి భూదేవిని తనను ఈ భూమి మీద ఉండకుండ నీ ఒడిలోకి తీసుకెళ్లమని వేడుకుంటుంది. భూదేవి ఒక్కసారిగా భూమి చీల్చుకుని పైకి వచ్చి సీతను తన ఒడిలోకి తీసుకోని వెలుతుంది. అలా సీత తన తనువు చాలిస్తుంది. ఉత్త్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్, వారణాసి ప్రాంతాలను కలుపుతూ ఉండే జుంగిగంజ్ అనే రైల్వే స్టేషన్ వద్ద సీతామర్హి అనే ఓ ప్రాంతం ఉంది. ఇదే ప్రాంతంలో ఒకప్పుడు సీతాదేవి తన తల్లి భూదేవితో కలిసి వెళ్లిపోయిందని చెబుతారు.
సీతాదేవి తనువ చాలించిన తర్వాత రాముడు అయోధ్య రాజ్యాన్ని పాలిస్తూ తన కుమారులైన లవ, కుశులకు యుద్ధ విద్యలు నేర్పుతుంటాడు. అలా ఒక రోజు యమధర్మరాజు ఒక ముని వేశంలో వచ్చి రాముడిని కలసి “రామా! మనం మాటాడే విషయాలు వేరెవ్వరికి తెలియకూడదు, ఒక వేళ అలా మధ్యలో ఎవరైనా ప్రవేశించినా, విన్నా మరణదండన విధిస్తానంటే నీతో ముచ్చటిస్తాను” అని అంటాడు., యమధర్మరాజు మాటకి సరే అని తన భవనంలో చివరిగా ఉండే గదిలోకివెళ్తారు ఇద్దరు. ఆ గదికి లక్ష్మణుడు కాపలాగా ఉంటాడు.
గదిలోకి వెళ్లిన యమధర్మరాజు, రాముడు ఇద్దరు మాట్లాడుతుండగా ఇంతలో యమధర్మారాజు రామ మీరు ఇక తనువూ చాలించవలసిన సమయం ఆసన్నం అయింది అని చెప్పుతాడు, గదిలో రాముడు, యమధర్మరాజు మాట్లాడుకుంటున్న వేళ రాముడి కోసం ముక్కోపి అయిన దుర్వాసనుడు వస్తాడు, అతనికి లక్షణుడు అడ్డు చెప్పిన వినకుండా లోపలికి వెళ్తాడు, దుర్వాసుడిని లోపలికి పంపి అన్న చెప్పిన మాట పాటించలేదని లక్షణుడు సరియు నదిలో జలసమాధి అయ్యి శేషనాగు అవతారంలోకి మారిపోతాడు. కొన్ని రోజుల తరువాత అయోధ్య రాజ్య బాధ్యతలని లవ, కుశలకి అప్పగించి రాముడు కూడ సరియు నదిలోకి వెళ్లి రామావతారం నుండి విష్ణువు అవతారంలోకి మారిపోతాడు.