భారత ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన గ్రామాల దత్తతను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు తెలంగాణలో ఓ గ్రామాన్ని, ఆంధ్ర ప్రదేశ్ లో ఓ గ్రామాన్ని, దాని డెవలప్ మెంట్ కి సంబందించిన వర్క్ ని కూడా స్టార్ట్ చేసాడు.అలాగే యంగ్ హీరో మంచు విష్ణు కూడా ఆంధ్రప్రదేశ్ లో పలు గ్రామాలను దత్తత తీసుకొని చేస్తున్నాడు, వీరిబాటలోనే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కుడా తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్త తీసుకొని, గత కొద్ది రోజులుగా ఆ గ్రామలోనే ఉంటూ అక్కడ ఏమేం డెవలప్ చేయాలి అనే విషయాలపై వర్క్ చేస్తున్నాడు.
వీరి లిస్టులో తాజాగా మరో స్టార్ యాక్టర్ జాయిన్ అయ్యాడు. అతనే సుమన్.. తాజగా సుమన్ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలోని సుద్దపల్లి విలేజ్ ని దత్తత తీసుకున్నాడు. తెలంగాణ విభజన సమయంలో ఆ విషయానికి మద్దతు తెలిపిన సుమన్ ఇప్పుడు తన వంతుగా సిద్దపల్లి గ్రామాన్ని డెవలప్ చేయనున్నాడు. దీనికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే చేయనున్నారు.