జియో దెబ్బకి ఎక్కువగా నష్టపోయిన మొబైల్ నెట్ వర్క్ ఎయిర్ టెల్ మాత్రమే, జియో రాకముంది సిమ్ కార్డుల విషయంలో, డేటా వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ జియో ఆఫర్ల ఎఫెక్ట్ కి ఘోరంగా పడిపోయింది, జియో దెబ్బ నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎయిర్ టెల్ జియో మాదిరిగానే ఒక బంపర్ ఆఫర్ ని తీసుకొచ్చింది, ఏడాది పాటు ఉచితంగా 4G డేటా, అన్ని మొబైల్ నెట్ వర్క్ లకి అపరిమిత ఉచిత కాల్స్ అనే ఆఫర్ ని ప్రకటించింది, కాకపోతే ఈ ఆఫర్ కేవలం మైక్రోమ్యాక్స్ కాన్వాస్-2 మొబైల్ కొన్నవారికే వర్తిస్తుంది.
ఎయిర్ టెల్ , మైక్రో మాక్స్ కంపెనీల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ కొన్నవారికి ఆఫర్ కింద ఒక ఏడాదిపాటు ఉచితంగా 4జీ డేటా అందివ్వడంతో పాటు ఏ మొబైల్ నెట్వర్కుకైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని మైక్రోమ్యాక్స్ స్పష్టం చేసింది. ఎయిర్టెల్ 4జీ సిమ్తో రానున్న ఈ స్మార్ట్ఫోన్ గోరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. దీనికోసం కార్నింగ్ సంస్థతో భాగస్వామ్యమైనట్లు మైక్రోమ్యాక్స్ సంస్థ యాజమాన్యం వెల్లడించింది. మే 17నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్న మైక్రోమ్యాక్స్ కాన్వాస్-2 ధర రూ.11,999.