1990లో ఇరాక్ వార్ సందర్భంగా కువైట్లో చిక్కుకున్న భారతీయుల్ని రక్షించేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ ఆధారంగా బాలీవుడ్లో రానున్న ‘ఎయిర్ లిఫ్ట్’ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక దుమారం రేపింది కూడా అక్షయ్ కుమార్ హీరోగా రాజాకృష్ణ మీనన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2 నిమిషాల ట్రైలర్ విడుదలైన 24 గంటలలోనే 20 లక్షల హిట్లని అందుకుంది. ఇది ఒక రికార్డ్ గా చెప్పుకుంటున్నారు బాలీవుడ్ జనాలు. కువైట్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే క్రమంలో ఎదురైన పరిస్థితులను దర్శకుడు రాజ్ మీనన్ చాలా అద్భుతంగా తెరకెక్కించారని అక్షయ్ అన్నారు. ఇందులో అక్షయ్ కువైట్ బిజినెస్మేన్గా కనిపించనున్నాడు. అంతేకాదు, ఈ సినిమాలో సద్దాం పాత్ర కూడా ఉంటుందట. ఐతే ఈ సినిమా ఇప్పటి పరిస్థితుల్లో వివాదాస్పదం ఔతునాదా అన్నది ప్రశ్న. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 22న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ వెల్లడించింది.