Home / Entertainment / అతడోక్కడే 28 మంది హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేశాడు.

అతడోక్కడే 28 మంది హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేశాడు.

Author:

Allari Naresh Latest News

అతడు అల్లరి అనే చిత్రంతో చలన చిత్ర రంగప్రవేశం చేయడం వల్ల, తెలుగు ప్రజలకు “అల్లరి” నరేష్ గా సుపరిచితుడు. హాస్య ప్రధానమైన చిత్రాలతో పాటు అభినయ ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా పోషిస్తూ ఈ తరం రాజేంద్ర ప్రసాద్ గా పేరొందాడు. గమ్యం చిత్రంలో గాలి శీను పాత్ర, శంభో శివ శంభోలో మల్లి పాత్ర ప్రాణం లో శివుడు, కాశీ పాత్రలు నరేష్ నటనా కౌశలానికి మచ్చుతునకలు అతను సినిమా అంటే ప్రేక్షకులు అనుకునేదోక్కటే..అబ్బా హ్యాపీగా నవ్వుకోవచ్చు అని. అతనే అల్లరి నరేష్. ఈ హీరో నిర్మాతల పాలిట కామధేనువు లాంటివాడు. మినిమమ్ గ్యారెంటీ హీరో అని కూడా ఇతనికి పేరుంది. నరేష్ సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 14 సంవత్సరాలు కావస్తోంది. ఇప్పటి వరకూ నరేష్ 49 సినిమాలు చేశాడు. త్వరలో అతని 50వ సినిమా ‘మామ మంచు అల్లుడు కంచు’ విడుదల కాబోతోంది. ఈవీవీ కొడుకుగా పరిచయమైనా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడ నరేష్,ఈ మద్యనే ఒక ఇంటి వాడు అయ్యడు.

ఇక్కడ విశేషమేమిటంటే ఇప్పటి వరకూ నరేష్ 28మంది హీరోయిన్లను తెలుగు తెరకు తన సినిమాల ద్వారా పరిచయం చేశాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ ఈ ఘనత ఎవరూ సాదించలేదు. నరేష్ కూడా ఇదే విషయాన్ని వినయంగా ఒప్పుకుంటాడు. అయినా కూడా నేనెప్పుడూ వాళ్లకు లైఫిచ్చాను అని అనుకోనని కాస్త లౌక్యం కూడా చూపుతాడు. మధు శాలిని, పూర్ణ, అర్చన, శాలి భగత్ వంటి ఎందరో కొత్త హీరోయిన్లు నరేష్ పక్కనే మనకు పరిచయమయ్యారు.

(Visited 110 times, 1 visits today)