స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…జులాయి, ఇద్దరమ్మాయిలతో, రేసు గుర్రం, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లాంటి రెండు వరుస విజయాలతో జోష్ మీద ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు బలమైన భావోద్వేగాలతో ఫుల్ లెంగ్త్ మాస్ సినిమాలు తీసే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న భోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సరైనోడు’ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్లో ఓ కీలక షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఆడియో రిలీజ్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి ఆసక్తికరంగా కనిపిస్తోంది.
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ‘సరైనోడు’ ఆడియోను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఫస్ట్లుక్ మరియు టీజర్ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఫస్ట్లుక్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానులకు ఆడియో రిలీజ్పై కూడా అప్డేట్ వస్తూండడం ఇంకా ఉత్సాహాన్నిచ్చే విషయం. రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.