Home / Entertainment / వెయ్యి మందికి ‘సరైనోడు’.

వెయ్యి మందికి ‘సరైనోడు’.

Author:

allu-arjun-boyapati

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సరైనోడు’.సన్నాఫ్ ఆఫ్ సత్యమూర్తి’లో విరాజ్ ఆనంద్‌గా క్లాస్ లుక్‌లో కనిపించిన అల్లు అర్జున్ ఇప్పుడు ఫుల్ మాస్ పాత్రలో కనిపించనున్నారు. బోయపాటి శ్రీను పూర్తి స్థాయి మాస్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారాయన. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ బుధవారం హైదరాబాద్.రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ కథానాయికలు. అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.తను దర్శకత్వం వహించే ప్రతి చిత్రంలోనూ యాక్షన్ సన్నివేశాలకు పెద్దపీట వేసే బోయపాటి బన్నీ నటిస్తున్న ఈ చిత్రంలో కూడా పోరాట సన్నివేశాలను అద్భుతంగా తెరకేక్కిస్తున్నాడు.

ఈ చిత్రంలో ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఒక ఫైట్ ని బోయపాటి వెయ్యి మందితో తెరకేక్కిస్తుండటం విశేషం. ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇలాంటి భారీ యాక్షన్ సన్నివేశంలో నటించడం ఇదే ప్రధమం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శ్రీకాంత్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్రలో కనిపించనున్నాడు. ఫిబ్రవరి లోగా షూటింగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్ లో సినిమాని విడుదల చేయడానికి దర్శక,నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

(Visited 169 times, 1 visits today)