అవార్డుల విషయంలో “తాను వెనక్కి తిరిగిచ్చేది లేదు అనీ అవి తన ను అభినందిస్తూ వచ్చినవి కానీ ఏ పార్టీ ప్రభుత్వమూ ఇచ్చినవి కాదంటూనే” అవార్డులని తిరిగిచ్చే వారిపై సెటైర్లు వేసిన కమల్ హసన్ ఒక్కసారిగా చిన్న పాటి సంచలనానికి తెర తీసాడు. ఐతే తన గత సినిమా విస్వ రూపం వచ్చినప్పుడు ముస్లింలూ,లౌకిక వాదుల నుంచీ ఎదురైన వ్యతిరేకతను ఎదుర్కునేందుకు సహాయ పడిన పార్టీలకూ ఆయా శక్తులకూ తానూ తిరిగి చేసే సాయం ఇదేనన్న విమర్శలు తమిళ ఇండస్ట్రీ నుంచే వచ్చినా, తమిళ నాడు లోని కొన్ని ప్రాంతాలో సొంత అభిమానులే చీ…! అన్నా.. పట్టించుకోలేదు కమల్. మరి శ్రీలంక లో తమిళులపై దాడులప్పుడు ఎండుకు వారికి మద్దతు తెలియ చేస్తూ నినదించారు? ఇప్పుడు దేశం లో ఉన్న పరిస్థితుల పై నిరసన తెలియజేయ కున్నా మౌనంగా ఉండ వచ్చుకదా..! అన్న ప్రశ్నలకూ కమల్ నుంచి ఏ సమాధానమూ లేదు.
అంతే కాదు రెండు రోజుల క్రితం చంద్ర బాబుని కలిసిన కమల్ “చీకటి రాజ్యం” ప్రీమియర్ చూడటనికి ఆహ్వానించేందుకు వచ్చానని చెబుతున్నా. బయటికి పొక్కిన సమాచారం ప్రకారం ఇంతకీ అసలు కధ ఏమిటంటే ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిలో కమల్ పాలుపంచుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారని, అందులో భాగంగానే ఈ సమావేశం జరిగిందని సమాచారం.అంతేకాక, ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కమల్ ఓ సంస్థ నెలకొల్పాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై కమల్ చంద్రబాబుతో సంప్రదింపులు జరిపారని,ఇప్పటికే నిర్మాణ రంగం లో ఉన్న కమల్ అమరావతి నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించేందుకు అవకాశం ఇవ్వాలని కూడా కోరినట్టు సమాచారం. అంటే కొన్ని నిర్మాణాలకు కాంట్రాక్టు లతో పాటు తన సంస్థలను కూడా అమరావతిలో నెలకొల్పాలనుకుంటున్నారట.దీని కోసమే ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండేందుకు మోడీ ఆఫీస్ నుంచి బాబు గారికి కాల్ కూడా వెళ్ళిందని సమాచారం. ఇదన్న మాట అవార్డుల విశయం లో కమల్ గారు ప్రభుత్వాన్ని వెనకేసుకు రావటానికి గల కారణం…