సూపర్స్టార్ మహేష్ బాబు ఇంతకాలం సినిమాలు, వాణిజ్య ప్రకటనలతో బిజీగా ఉండేవాడు. ఇకనుంచి మహేష్ బిజినెస్ రంగంలో కూడా బిజీకానున్నాడు. తాజాగా మహేష్ ఓ మల్టీప్లెక్స్ను నిర్మించిన సంగతి తెలిసిందే. ఆదివారం నాడు మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఈ మల్టీప్లెక్స్ను చూసిన ప్రతిఒక్కరూ వేరే ప్రపంచంలోకి వెళ్లినట్టుందే అని ఆశ్చర్యపోతున్నారట.
ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే…ఈ మల్టీప్లెక్స్ లో మహేష్ బాబు షేర్ ఇరవై శాతం మాత్రమే అంట. మహేష్బాబు వాటాతో పాటు ఇంకా అందులో నలుగురి వాటాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆ మల్టీప్లెక్స్లో మొత్తం ఏడు స్క్రీన్స్ ఉండగా, అందులో రెండు పూర్తిగా మహేష్బాబు సొంతం కాగా ఇతర స్క్రీన్స్లో కొంత భాగం షేర్ ఉందని తెలుస్తోంది.
మహర్షి చిత్రంతో వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. రికార్డు స్థాయిలో మహర్షి బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతుంది. ఇటు సినిమాలు అటు బిజినెస్ లలో మహేష్ దూసుకుపోతున్నారు.
Just watched a film in @urstrulyMahesh ‘s AMB Cinemas..The only problem with this Superplex is,its difficult for any film to match to this wonderful place ..The theatre is a SUPER DUPER BLOCKBUSTER
— Ram Gopal Varma (@RGVzoomin) December 2, 2018
అయితే ఏ విషయమైనా సరే.. తన శైలిలో స్పందించే రామ్గోపాల్ వర్మ.. మల్టీప్లెక్స్ మహేష్లా అందంగా ఉందని డిఫరెంట్గా కామెంట్ చేశాడు. అయితే నిన్నటి ఈవెంట్కు హాజరైన ఆర్జీవీ.. తాజాగా మరో కామెంట్ చేశాడు. ‘ఇప్పుడే ఏఎమ్బీ చూశాను. అయితే దీంట్లో ఉన్న సమస్య ఏంటంటే.. ఈ సూపర్ప్లెక్స్కు తగ్గట్టు సినిమాలు రావడం అంటే కష్టం. ఈ థియేటర్ సూపర్ డూపర్ బ్లాక్బస్టర్’ అంటూ ట్వీట్ చేశాడు.